తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది కమెడియన్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కాని కొంత మంది కమెడియన్స్ మాత్రం తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం దక్కించుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన కమెడియన్స్ లలో ఒకరు కృష్ణ భగవాన్.  ప్రస్తుతం బుల్లితెరపై అవకాశాలు రాకపోవడం తో కనుమరుగైనా కృష్ణభగవాన్ ఒకప్పుడు మాత్రం టాప్ కమెడియన్గా కొనసాగారు అనే విషయం తెలిసిందే.  ఇక తనదైన స్టైల్ లో కామెడీ చేసి  ప్రేక్షకులను ఆకర్షించి  ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ఆయన.



 ముఖ్యంగా స్పాంటేనియస్ పంచులు వేస్తూ కామెడీ ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు.  అయితే కృష్ణభగవాన్ ప్రస్తుతం తెలుగు వెండి తెర పై కనుమరుగయ్యారు అనే విషయం తెలిసిందే.  సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఎక్కడా కనిపించడం లేదు. అయితే ఇటీవల ఆలీతో సరదాగా అనే  కార్యక్రమానికి గెస్ట్ గా  హాజరయ్యారు కృష్ణభగవాన్. కృష్ణభగవాన్ తో పాటు 30 ఇయర్స్ పృద్విరాజ్ కూడా ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి వచ్చాడు.  ఈ క్రమంలోనే ఎవరికీ తెలియని ఒక విషయాన్ని బయట పెట్టాడు వ్యాఖ్యాత అలీ.




 ఇక ఇటీవల విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే రెచ్చిపోదాం బ్రదర్ భార్య లేక మస్థుగుంది  వేదర్  అనే పాట పై ఎంట్రీ  ఇచ్చారు ఇద్దరు కమేడియన్స్. ఈ క్రమంలోనే ఏంటి పాపారావ్ చౌదరి గారు బాగున్నారా అంటూ కృష్ణభగవాన్ ను అడుగుతాడు కమెడియన్ ఆలీ.  దీంతో ఒక్కసారిగా కృష్ణభగవాన్ షాక్ అవుతాడు. ఇక ఆ తర్వాత షాక్ నుంచి తేరుకుని...  బాగున్నాను అలిగారు అంటూ సమాధానం చెబుతాడు కృష్ణ భగవాన్. ఇక ఆ తర్వాత తన కెరీర్ గురించి పలు విషయాలను అభిమానులతో పంచుకుంటారు కమెడియన్ కృష్ణభగవాన్.

మరింత సమాచారం తెలుసుకోండి: