ప్రస్తుతం నేషనల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తాజా చిత్రం " రాధే శ్యామ్ " సినిమా చివరి దశకు వచ్చినందున వెంటనే మరో రెండు సినిమాలను పట్టలేక్కించేందుకు ప్రభాస్ సిద్దంగా ఉన్నాడు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న "ఆది పురుష్ " సినిమాను అలాగే పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న " సలార్ " సినిమాను ఏకకాలంలో షూటింగ్ ప్రారంభించేందుకు ప్రభాస్ సిద్దమయ్యాడు.

 అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” పై  తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి. ఎందుకనగా ప్రశాంత్ నీల్ " కే‌జి‌ఎఫ్ " సినిమాతో ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించాడు. అంతే కాకుండా ప్రశాంత్ నీల్ తాజా చిత్రం " కే‌జి‌ఎఫ్ చాప్టర్ 2 " టీజర్ ఇటీవల విడుదలై దేశ వ్యాప్తంగా ఏ సినిమా కూడా టచ్ చేయలేని రికార్డ్స్ ను సొంతం చేసుకుంది. దీంతో ప్రభాస్ తో తెరకెక్కించే " సలార్ " పై నెలకొన్న అంచనాలు వర్ణనాతీతం.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమా తాలుకా షూట్ ను కూడా మేకర్స్ ఇటీవలే స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ప్రకారం మేకర్స్ ఈ సినిమాలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ తోనే రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఖమ్మం జిల్లా గోదావరిఖని మైనింగ్ ప్రాంతంలో కొన్ని కీలక సెట్టింగ్స్ వేసి భారీ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతే కాకుండా మరిన్ని సన్నివేశాలు కూడా కొన్ని బొగ్గు గని ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటాయని కూడా తెలుస్తుంది. ఇక ఈ భారీ చిత్రానికి సంబంధించి హీరోయిన్ పై కూడా కొన్ని రోజుల్లో క్లారిటీ రానున్నట్టు కూడా వినికిడి. ఇక ఈ చిత్రాన్ని కూడా కేజీయఫ్ నిర్మాతలు హోంబలే వారే నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: