వెంకటేష్ నటిస్తున్న ‘నారప్ప’ మూవీ ఇప్పటికే విడుదల అయిపోయి ఉండేది. కరోనా సమస్యలు అడ్డు తగలడంతో ఈమూవీ షూటింగ్ పూర్తి కావడం ఆలస్యం అయింది. ఇప్పుడు షూటింగ్ పూర్తి కావడంతో ఈమూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసి ఈసినిమాను సమ్మర్ రేస్ లో విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు.


క్రియేటివ్ డైరెక్టర్ గా పేరుగాంచిన శ్రీకాంత్ అడ్డాల కెరియర్ కు ఈమూవీ అత్యంత కీలకం కావడంతో ఈమూవీ ద్వారా తిరిగి తన సత్తా చాటాలని శ్రీకాంత్ చాలగట్టి పట్టుదల పై ఉన్నాడు. ప్రస్తుతం ఎడిటింగ్ స్టేజ్ లో ఉన్న ఈమూవీలోని కొన్ని సన్నివేశాలు శ్రీకాంత్ అడ్డాలకు నచ్చలేదని తెలుస్తోంది.


దీనితో ఆ సీన్స్ మళ్ళీ రీషూట్ చేద్దామని శ్రీకాంత్ అడ్డాల వెంకటేష్ ను అడిగినప్పటికీ అతడు పెద్దగా ఆశక్తి కనపరచం లేదని మాటలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ శ్రీకాంత్ తన పట్టుదల వీడకుండా నిర్మాత సురేష్ బాబు ద్వారా వెంకటేష్ పై ఒత్తిడి చేస్తున్నట్లు టాక్. కోలీవుడ్ టాప్ హీరో ధనుష్ నటించిన సూపర్ హిట్ తమిళ మూవీ ‘అసురన్’ కి రీమేక్ గా ఈమూవీని తీస్తున్న విషయం తెలిసిందే.


ఈమూవీలో వెంకటేష్ రైతుగా ఇద్దరు పిల్లల తండ్రిగా కనిపించనున్నాడు. ‘నారప్ప’ భార్య సుందరమ్మ గా ప్రియమణి నటిస్తోంది. ఈమూవీ సెకండ్ ఆఫ్ లో వచ్చే సీన్స్ కొన్ని అత్యంత కీలకం కావడంతో ఆసీన్స్ లో వెంకటేష్ తో మరింత మెరుగుగా నటింప చేయాలని శ్రీకాంత్ అడ్డాల ఆలోచన అని అంటున్నారు. అయితే ప్రస్తుతం వెంకటేష్ ‘ఎఫ్ 3’ షూటింగ్ లో బిజీగా ఉండటంతో మళ్ళీ ‘నారప్ప’ రీ షూట్ కు తన డేట్స్ ను ఇచ్చే విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నాడని సమాచారం. ఇప్పటికే ఈమూవీ టీజర్ కు మంచి స్పందన వచ్చిన నేపధ్యంలో ఈమూవీలోని సన్నివేశాలు కూడ అదేస్థాయిలో ఉండాలని శ్రీకాంత్ అడ్డాల ఆలోచనతో  ఈ రీషూట్ గురించి ఒత్తిడి చేస్తున్నాడు అని అంటున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: