మెగా ఫ్యామిలీ నుండి రాబోతున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. సుకుమార్ అసిస్టెంట్ బుచ్చి బాబు డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో కన్నడ భామ కృతి శెట్టి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. సినిమా నుండి వచ్చిన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై బీభత్సమైన క్రేజ్ ఏర్పరిచాయి. ఫిబ్రవరి 12న రిలీజ్ ఫిక్స్ చేసిన ఈ సినిమా ఫస్ట్ కాపీని మెగాస్టార్ చిరంజీవి చూశారని తెలుస్తుంది.

మెగా హీరోల్లో రిలీజ్ అవ్వాల్సిన ఏ సినిమా అయినా చిరు చూసి సూపర్ అన్న తర్వాతే రిలీజ్ చేస్తారు. చివరి నిమిషంలో ఏదైనా మార్పులు ఉంటే చిరు తన ఇన్నేళ్ల ఎక్స్ పీరియన్స్ తో చెబుతారట. సినిమా బాగుంటే సూపర్ అనేస్తారట. చిరు జడ్జ్ మెంట్ బాగుంటుందని చెబుతుంటారు. ఇదిలాఉంటే ఉప్పెన సినిమా చూసిన చిరు అదిరిపోయింది అన్నారట. అంతేకాదు డైరక్టర్ బుచ్చిబాబుని భారతీరాజాతో పోల్చినట్టు టాక్.

చిరు మెప్పు పొందాడు అంటే తప్పకుండా సినిమా ఆశించిన స్థాయిలో ఉన్నట్టే లెక్క. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిల జోడీ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందట. సినిమాలో విలన్ గా నటించిన విజయ్ సేతుపతి కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాడని అంటున్నారు. అంతేకాదు సినిమా క్లైమాక్స్ అందరిని టచ్ చేస్తుందని చెబుతున్నారు. మొత్తానికి చిరు సూపర్ అనేశాడు అంటే తప్పకుండా ఉప్పెన ఓ రేంజ్ లో ఉండబోతుందని మాత్రం చెప్పొచ్చు. ఉప్పెన రిలీజ్ కాకుండానే క్రిష్ డైరక్షన్ లో వైష్ణవ్ తేజ్సినిమా చేశాడు. కొండపొలం నవల ఆధారంగా ఆ సినిమా తెరకెక్కింది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కూడా ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ అవుతుందని తెలుస్తుంది.                        



మరింత సమాచారం తెలుసుకోండి: