జుమ్మందినాదం సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన అందాల తార తాప్సి పన్ను. మొదటి సినిమాతోనే తాప్సి ఫ్యాన్స్ ను కట్టి పడేసింది. ఈ సొట్ట బుగ్గల సుందరికి కుర్రకారు ఫిదా అయ్యారు. ఇక ఆతరవాత వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతో ఫుల్ పాపులర్ అయ్యింది. కానీ ఆ తరవాత సినిమాల్లో మాత్రం తాప్సి అంతగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈ అమ్మడికి టాలీవుడ్ లో ఆఫర్లు తగ్గిపోయాయి. కానీ ప్రస్తుతం బాలీవుడ్ లో మాత్రం ఈ అమ్మడి హవా నడుస్తోంది. ఓ వైపు హీరోల పక్కన రోమన్స్ చేస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ సత్తా చాటుతోంది. పింక్,తప్పడ్ లాంటి చిత్రాల్లో తాప్సి నటనకు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం తాప్సి భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్ "శబాష్ మీతు" లో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రానికి రాహుల్ దొలాకియా దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాను రెండేళ్ల క్రితమే మొదలు పెట్టినప్పటికీ అనేక కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అయ్యింది. ఇటీవల లాక్ డౌన్ తో షూటింగ్ కు మళ్ళీ బ్రేక్ పడింది. మరోవైపు తాప్సి సైతం ఇతర ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉంది. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ ను మళ్ళీ ప్రారంభించారు. ఈ సంధర్భంగా తాప్సి బ్యాట్ పట్టుకుని బాల్ కోసం వెయిట్ చేస్తూ పోస్ ఇచ్చిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మళ్ళీ బాల్ బ్యాట్ తో రొమాన్స్ మొదలైంది. ఈ సినిమా నా జీవితంలో మరో మైలురాయి అంటూ పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫోటోసోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా తాప్సి ట్వీట్ కు రీప్లే ఇచ్చింది. నువ్వు ఈ పాత్రకు న్యాయం చేయగలవు అంటూ మిథాలీ తాప్సికి రీప్లే ఇచ్చింది. ఎన్నో పాత్రల్లో నటించి అలరించిన తాప్సి క్రికెటర్ పాత్రలో ఏయేవిధంగా అలరిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: