ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ప్రేక్షకులకు వినోదం. అలాంటి వినోదాన్ని పంచే సినిమా అంటే ప్రేక్షకులకి ఎందుకు ఇష్టం ఉండదో చెప్పండి. ఇక ఒక  సినిమా విజయం సాధిస్తుందా హిట్ అవుతుందా ప్లాప్ అవుతుందా అనేది  అన్నది తరువాత సంగతి. ఎలాంటి సినిమా అయినా సరే ముందుగా పెట్టిన పెట్టుబడికి నాలుగు డబ్బులు రాబట్టగలిగితేనే సినిమా తీసిన వారికి మరో లైఫ్ ఉంటుంది. అయితే ఒకేసారి రెండు సినిమాలు రిలీజ్ అవ్వడమే రిస్క్ అనుకుంటున్న తరుణంలో ఏకంగా 8 సినిమాలు వస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. అయితే అందులో సగానికి పైగా సినిమాలు ఎవరికి తెలియనివి. కనీసం వాటి గురించి ఎలాంటి ప్రచారం కూడా చెయ్యకుండా విడుదల చెయ్యడానికి సిద్ధమవుతున్నారట ఆ మూవీ మేకర్స్...

ఇక ఇప్పటికే క్రిస్ట్మస్ కి సోలో బ్రతుకు సో బెటర్, సంక్రాంతి కి క్రాక్, మాస్టర్, రెడ్, అల్లుడు అదుర్స్, బంగారు బుల్లోడు సినిమాలు సందడి చేశాయి. ఇక ఈ నెలలో ఈ వారం 29న ఎనిమిది సినిమాలు వస్తున్నాయి. ఒకే రోజున బాక్స్ ఆఫీస్ ని షేక్ చెయ్యడానికి రెడీ అవుతున్నాయి.  ఇక అందులో ముఖ్యంగా అందరికి తెలిసిన సినిమా యాంకర్ ప్రదీప్ నటించిన 30రోజుల్లో ప్రేమించడం ఎలా?. ఈ సినిమాకు పాటతోనే మంచి క్రేజ్ అందుకుంది. కానీ థియేటర్స్ లో ఎంతవరకు క్లిక్కవుతుందో తెలియదు. ఇక పవన్ ఫ్యాన్స్ మీద నమ్మకంతో జై సేన అనే సినిమా రానుంది. సునీల్, శ్రీకాంత్ ఇందులో నటించారు. ఇక అన్నపూర్ణమ్మ గారి మనవడు, అమ్మ దీవెన, ఎవరు చెప్పిన నమ్మరు, కళా పోషకులు, మిస్టర్ అండ్ మిస్, నాతో ఆట..అనే సినిమాలు ఒకే రోజున బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చెయ్యడానికి రెడీ అవుతున్నాయి.కాని ఇది ప్రేక్షకులకి వినోదంగా వున్న సినిమా ఇండస్ట్రీకి అంత మంచిది కాదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: