పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సలార్". ఈ సినిమాను హంబెల్ గుడ్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. సినిమాలో ప్రభాస్ కి జంటగా శృతిహాసన్ నటిస్తోంది. నేడు శృతి బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ విషెస్ చెబుతూ సలార్ కు వెల్ కమ్ చెప్పింది. ఈ సినిమాను కూడా ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో యష్ హాజరయ్యాడు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు. మొదటి షెడ్యూల్ ను తెలంగాణలోని గోదావరి ఖని ఓపెన్ క్యాస్ట్ బొగ్గు గనిలో చిత్రించేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. అయితే తాజాగా ఏ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తోంది. సినిమాలో ఆరు భారీ యాక్షన్ సీన్లు ఉన్నట్టు వార్త చక్కర్లు కొడుతోంది.

అంతే కాకుండా భారీ యాక్షన్ సీన్ల కోసం దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ స్టెంట్ మాస్టర్ లను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. అయితే మొదట వాటిలో ఒక యాక్షన్ సన్నివేశాన్ని గోదావరి ఖనిలో చిత్రించనున్నారట. ఇక ఈ న్యూస్ తెలిసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన హీరో సినిమాలో ఓ రేంజ్ లో యాక్షన్ ఉండబోతుందని ఊహించుకుంటున్నారు. సలార్ పై ఎలాంటి అప్డేట్ వచ్చినా ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.  ఇదిలా ఉండగా ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులకే కాక ప్రేక్షకులందరికి భారీ అంచనాలు ఉన్నాయి. ఓ వైపు పాన్ ఇండియా స్టార్..మరోవైపు కేజీఎఫ్ లాంటి సెన్సేషనల్ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ కావడంతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. మరి ఆ అంచనాలను ప్రభాస్ రీచ్ అవుతారా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: