ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టీకల్ చదవండి.. కొన్ని కొన్ని సినిమాలు ఉంటాయి. చాలా అంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. అనుక్షణం ఆసక్తికరంగా ఉంటాయి. కేవలం ఒక్క ఇన్సిడెంట్ తో కథని మలుపు తిప్పుతాయి. ఇక తాజాగా రాబోతున్న "థాంక్ యూ బ్రదర్" కూడా ఆ కోవకి చెందింది.
అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. ఉత్కంఠభరిత అంశాలతో ఒక డ్రామా ఫిల్మ్గా ‘థ్యాంక్ యు బ్రదర్’ను నూతన దర్శకుడు రమేష్ రాపర్తి తెరకెక్కిస్తున్నాడు. జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.సురేష్ రగుతు సినిమాటోగ్రాఫీ, గుణ బాలసుబ్రమణియన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్స్ కానున్నాయి. షూటింగ్ పూర్తయిన ‘థ్యాంక్ యు బద్రర్’ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.గురువారం ‘థ్యాంక్ యు బ్రదర్’ ట్రైలర్ను విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు.ట్రైలర్ లాంచ్ చేసిన విక్టరీ వెంకటేష్కు దర్శక నిర్మాతలు ధన్యవాదాలు తెలుపుతూ, ట్రైలర్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో, సినిమా కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటుందనీ, అందరికీ నచ్చుతుందనీ అన్నారు.ఇక ట్రైలర్ విషయానికి వస్తే, ప్లేబాయ్ లాంటి అభి ఓ యువకుడు, ప్రెగ్నెంట్ అయిన ప్రియ అనే యువతి ఓ లిఫ్ట్లో ఉండగా పవర్ పోయి, అందులో చిక్కుకుపోయినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయనేది ప్రధానాంశంగా ట్రైలర్ లో కనిపిస్తుంది. ఉత్కంఠభరితమైన స్క్రీన్ప్లేతో డైరెక్టర్ రమేష్ రాపర్తి ఈ ఫిల్మ్ను రూపొందించారు. కచ్చితంగా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభవాన్ని ఇచ్చే విధంగా ఈ సినిమా రూపొందిందని ట్రైలర్ను చూస్తే అర్థమవుతుంది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన సినిమా విషయాలు గురించి తెలుసుకోండి...