దర్శక ధీరుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా ఈ మధ్యన ప్రేక్షలకు లేటెస్ట్ అప్ డేట్స్ అందిస్తూ వారిని ఉవ్విళ్లూరిస్తోంది. పోస్టర్లు, టీజర్లతో ఇప్పటికే  సినీ ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల రోజురోజులకు భారీ స్థాయిలో అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్ డేట్ కూడా ప్రజలను ఎంతో ఆసక్తికి గురిచేస్తోంది. మరి ఏంటనుకున్నారు.. దర్శక ధీరుడి సినిమా పట్ల ప్రజలు అంతలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాగా తాజాగా కూడా ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను జక్కన్న టీం ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ వీడియోనే  సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కాగా 2018 లో ఈ సినిమా స్టార్టింగ్ అయినా.. ఇంకా షూటింగ్ కంప్లీట్  చేసుకోలేదు. మరి జక్కన్న సినిమాలంటే ఆ రేంజ్ లో ఉండటం సహజమే కదా..షూటింగ్ లో ఏ లోపం లేకుండా చెయ్యడానికి ఇలాంటి ఎంతటి సమయాన్నైనా కేటాయిస్తారు జక్కన్న. అందుకే ఈ డైరెక్టర్ సినిమాలు ఆ రేంజ్ లోనే కలెక్షన్లను కొల్లగొడుతుంటాయి. కాగా ప్రస్తుతం సినిమా షూటింగ్ క్లైమాక్స్ దశకు చేరుకుంది. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటోంది ఆర్ఆర్ఆర్. కాగా‘నీళ్లలో నిప్పు ’ అంటూ మెగా హీరో రామ్ చరణ్ పై చిత్రీకరిస్తున్న ఓ షాట్ ను జక్కన్న టీం సోషల్ మీడియా వేధికగా పంచుకుంది.  కాగా ఇప్పటికే అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న చెర్రీ కి సంబంధించిన టీజర్ ఇప్పటికే రిలీజ్ అయ్యి మంచి టాక్ ను తెచ్చుకుంది.

కాగా ప్రస్తుతం చెర్రీ నిప్పు మధ్యలో పోరాడుతున్నట్టుగా అర్థమవుతోంది ఈ వీడియో ద్వారా. ఇక ఆర్ఆర్ఆర్ లో కొమురం భీం పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ కు సంబంధించిన టీజర్ రికార్డు క్రియేట్ చేసింది. కాగా ఈ టీజర్ సందర్భంగా ఆయన నీళ్లలోంచి ఆయుధం తీస్తున్నట్టుగా చూపించింది జక్కన్న టీం. దీన్ని బట్టి చూస్తే ఎన్టీఆర్ నీరుగా.. రామ్ చరణ్ ను నిప్పుగా అభివర్ణించింది  ఈ చిత్ర యూనిట్. కాగా ఎప్పుడెప్పుడు ఈ సినిమా తెరముందుకు వస్తుందా అని ఇన్నాళ్లు వెయిట్ చేసిన ప్రేక్షకులకు మంచి శుభవార్త చెప్పింది జక్కన్న టీం. ఈ సినిమాను అక్టోబర్ 13 న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: