ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...సాధారణంగా ఒక మంచి కథతో ఒక సినిమా ఓకే అయినప్పుడు నటీ నటుల ఎంపికల విషయంలో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే ముందుగా ఫిక్స్ చేసుకున్న తారలను తరువాత కొన్ని కారణాల వల్ల మార్చడం జరుగుతుంది.ఇక ఉప్పెన సినిమా విషయంలో కూడా అలాంటిదే ఒకటి జరిగింది. ఉప్పెన సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది క్యూట్ బ్యూటీ కృతి శెట్టి.ఈమె ఏమంటూ ఎంట్రీ ఇచ్చిందో కాని ఓవర్ నైట్ లో పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయింది. యూత్ ఈ బ్యూటీకి తెగ ఫిదా అయిపోతున్నారు. ఫస్ట్ సినిమాతోనే పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయింది. సోషల్ మీడియాలో కూడా ఈమెకి ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారు.అయితే మొదట ఈ సినిమాలో ఈమెను హీరోయిన్ గా అనుకోలేదట. ఎవరైనా తెలుగమ్మాయి అయితేనే బావుంటుందని ఆడిషన్స్ నిర్వహించి మనీషా అనే అమ్మాయిని ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చారు.



అయితే ప్రాజెక్ట్ మరికొన్ని రోజుల్లో మొదలు కాబోతోందని అనుకున్న సమయానికి దర్శకుడు బుచ్చిబాబు ఒక ఫ్రెండ్ ద్వారా కృతి శెట్టి ఫొటోలు చూసి తన ఆలోచనను మార్చుకున్నాడట.ఆ అమ్మాయి అయితే కరెక్ట్ గా సెట్టవుతుందని గురువు సుకుమార్ కు చెప్పడంతో ఆయన ఒక మాట అన్నారట. నీ కన్నా.. నా కన్నా సినిమానే గొప్పది.. సినిమాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయి.. అంటూ సుకుమార్ చెప్పడంతో బుచ్చిబాబు కృతిశెట్టిని ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చారు.



ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు బుచ్చిబాబు ఈ విషయాన్ని బయటపెట్టారు. ఇక కృతి శెట్టి బేబమ్మ పాత్రకు వంద శాతం న్యాయం చేసి దర్శకుడి నమ్మకాన్ని నిలబెట్టింది. ప్రస్తుతం కృతి శెట్టి రెండు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఇక భవిష్యత్తులో ఈ బ్యూటీ పెద్ద స్టార్ హీరోయిన్ కావడం ఖాయమని స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి....


మరింత సమాచారం తెలుసుకోండి: