ప్రేక్షకులను కట్టిపడేసే విధమైన కాన్సెప్ట్ తో వస్తుంటారు చిరు. అందుకే ఓ భారీ రేంజ్ లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న‘ఆచార్య ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మెగాస్టార్. ఎంతో బాధ్యతగా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ కూడా చిరు ఇమేజ్ కు తగ్గట్టుగానే పెట్టారు. ట్రైలర్ తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ మూవీ మే 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇకపోతే నందమూరి నటసింహం కూడా యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బిబి3 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాకు మోనార్క్, గాడ్ ఫాదర్ అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో కూడా ఓ సినిమాలో నటించనున్నాడు.
ఇకపోతే అక్కినేని నాగార్జున ఈ మధ్యనే ‘వైల్డ్ డాగ్’ సినిమాను పూర్తి చేసుకున్నారు. దాంతో ఈ హీరో ప్రవీణ్ సత్తారుతో మరో క్రేజీ ప్రాజెక్టును మొదలుపెట్టేసాడు. ఈ సినిమా ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను అలరించబోతుందట. ఇక విక్టరీ వెంకటేష్ కూడా ఈ మధ్యనే‘నారప్ప’ మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్నాడు. పల్లెటూరి నేపథ్యంలో ఎంతో వైవిధ్యభరితంగా రూపొందించబడిన ఈ సినిమా మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంతో పాటుగా ఎఫ్ 2 సీక్వెల్ గా అనిల్ రావుపూడితో ‘ఎఫ్ 3’ సినిమాలో పాల్గొంటున్నారు వెంకి. ఈ సీనియర్ స్టార్స్ లల్లో.. భారీ అంచనాలతో తెరకెక్కిన ‘ఆచార్య’ మూవీతోనే ఈ ఏడాది చిరు ప్రేక్షకుల ముందుకు రానుండగా.. బాలయ్య బాబు, అక్కినేని నాగార్జున, వెంకి లు రెండు రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. ఈ సినిమాల జోరు చూస్తుంటే ఈ ఏడాది సినీ ఇండస్ట్రీకి కొత్త కళ వచ్చినట్టు అనిపిస్తోంది.