గతేడాది కరోనా కారణంగా కొత్త సినిమాలు లేక వెలవెల బోయిన తెలుగు తెర ప్రస్తుతం  కళకళలాడుతోంది. ఎక్కడ చూసిన సినిమా సందడే కనిపిస్తోంది. ఇందులో కొందరు యంగ్ స్టార్ హీరోలు భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతుంటే.. మరి కొందరు హీరోలేమో.. కంటెంట్ బాగుంటే చాలు అని సినిమాల మీద సినిమాలను చేసేస్తూ.. ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నారు. ఇక టాలీవుడ్ సీనియర్ స్టార్స్ అయితే పక్కా ప్లానింగ్ తో సినిమాల్లో నటిస్తూ వెళుతున్నారు. ఇందులో ముందున్నది మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ, యువసామ్రాట్ అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ లు జోరు మీద సినిమాల్లో నటిస్తూ వెళుతున్నారు. కుర్రహీరోలకు మేమేమీ తక్కువ కాదన్నట్టు.. పోటీ పడి మరీ వరుస ప్రాజెక్టుల్లో పాల్గొంటున్నారు ఈ సీనియర్ స్టార్స్. ఇప్పుడు ఈ స్టార్స్ అంతా తమ ప్రాజెక్టులను తొందర తొందరగా పూర్తి చేసే పనిలో తీరిక లేకుండా సమయాన్ని గడుపుతున్నారు. ఈ సినిమాలతో ఈ హీరోలు సరికొత్త రికార్డులను క్రియేట్ చేయనున్నారని అర్థమవుతోంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే దానికో రేంజ్ కూడా ఉంటుంది.
 ప్రేక్షకులను కట్టిపడేసే విధమైన కాన్సెప్ట్ తో వస్తుంటారు చిరు. అందుకే ఓ భారీ రేంజ్ లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న‘ఆచార్య ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మెగాస్టార్. ఎంతో బాధ్యతగా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ కూడా చిరు ఇమేజ్ కు తగ్గట్టుగానే పెట్టారు. ట్రైలర్ తో  ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ మూవీ మే 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇకపోతే నందమూరి నటసింహం కూడా యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బిబి3 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాకు మోనార్క్, గాడ్ ఫాదర్ అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో కూడా ఓ సినిమాలో నటించనున్నాడు.

ఇకపోతే అక్కినేని నాగార్జున ఈ మధ్యనే ‘వైల్డ్ డాగ్’ సినిమాను పూర్తి చేసుకున్నారు. దాంతో ఈ హీరో ప్రవీణ్ సత్తారుతో మరో క్రేజీ ప్రాజెక్టును మొదలుపెట్టేసాడు. ఈ సినిమా ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను అలరించబోతుందట. ఇక విక్టరీ వెంకటేష్ కూడా ఈ మధ్యనే‘నారప్ప’ మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్నాడు. పల్లెటూరి నేపథ్యంలో ఎంతో వైవిధ్యభరితంగా రూపొందించబడిన ఈ సినిమా మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంతో పాటుగా ఎఫ్ 2 సీక్వెల్ గా అనిల్ రావుపూడితో ‘ఎఫ్ 3’ సినిమాలో పాల్గొంటున్నారు వెంకి. ఈ సీనియర్ స్టార్స్ లల్లో.. భారీ అంచనాలతో తెరకెక్కిన ‘ఆచార్య’ మూవీతోనే ఈ ఏడాది చిరు ప్రేక్షకుల ముందుకు రానుండగా.. బాలయ్య బాబు, అక్కినేని నాగార్జున, వెంకి లు రెండు రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. ఈ సినిమాల జోరు చూస్తుంటే ఈ ఏడాది సినీ ఇండస్ట్రీకి కొత్త కళ వచ్చినట్టు అనిపిస్తోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: