సినిమాల్లో హీరో హీరోయిన్స్ ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారు అనేది ముందుగా ఎవరు అంచనా వేయలేరు. అర్జున్ రెడ్డి సినిమా శర్వానంద్ తో చేయాలని సందీప్ రెడ్డి అనుకున్నారు కానీ ఆ గోల్డెన్ ఛాన్స్ విజయ్ దేవరకొండ కి దక్కింది. ఈ విధంగా దర్శకులు ఒకరితో చేయాలనుకున్న సినిమా మరొకరితో చేయాల్సి వస్తుంది. దీనికి కారణం మొదట అనుకున్న హీరో హీరోయిన్లకు ఇంట్రెస్ట్ లేకపోవడం, వారు ఆ సమయంలో బిజీగా ఉండటం, వారికి కంటెంట్ విషయంలో భిన్నాభిప్రాయాలు రావటం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు ఉంటాయి.
 
 
బాహుబలి సినిమాలో శ్రీదేవి కి శివగామి పాత్ర ఇవ్వాలి అనుకున్నారు కానీ అనూహ్యంగా రమ్యకృష్ణ ఆ గోల్డెన్ ఆపర్చునిటీ దక్కించుకొని ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అయితే ప్రస్తుతం అలాంటి మంచి అవకాశాలు అనూహ్యంగా ముగ్గురు హీరోయిన్లను వరించాయి. వారెవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.


 
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న 'సలార్' లో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ ని నటింపజేయాలని అనుకున్నారు. కానీ ఆ ఛాన్స్ చివరికి శృతిహాసన్ ని వరించింది. దీంతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. కేజిఎఫ్ డైరెక్టర్ సలార్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.


 
క్రిష్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఒక పిరియాడికల్ డ్రామా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో ఒక బాలీవుడ్ హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకోవాలి అని చిత్రబృందం భావించింది కానీ అది కుదరక చివరకి నిధి అగర్వాల్ ని హీరోయిన్ గా ఎంచుకుంది. దీంతో ఆమె పంట పండినట్లు అయింది.


 
బోయపాటి శ్రీను, బాలయ్య కాంబో లో వస్తున్న సినిమాకి హీరోయిన్ గా ప్రయాగా మార్టిన్ అనుకున్నారు. తరువాత సయేషా సైగల్ పేరు తెరమీదకు వచ్చింది. కానీ చివరికి ప్రజ్ఞా జైస్వాల్ ని కన్ఫామ్ చేశారు. అలాగే ఆచార్య సినిమాలో రామ్ చరణ్ సరసన ఎందరో హీరోయిన్లను అనుకున్నారు కానీ పూజా హెగ్డే ఆ అవకాశం దక్కించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: