ట్రైలర్లతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అక్టోబర్ 13న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. 2019, 2020 లో ఎన్టీఆర్ ఒక్క సినిమాను కూడా రిలీజ్ చెయ్యలేదు. దాంతో ఫ్యాన్స్ నిరాశ చెంది.. యంగ్ టైగర్ పాత సినిమాలను మళ్లీ థియేటర్లలో వేయించుకుని మరీ చూశారు. కొత్త సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ యమదొంగ కూడా తన రెండేండ్ల గ్యాప్ ను పూరించేందుకు అదిరిపోయే ప్లాన్ ఒకటి వేశాడట. ఈ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగానే.. ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో కలిసి ఓ సినిమా చేయనున్నాడన్న సంగతి తెలిసిందే. వీరి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు‘పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట డైరెక్టర్. ఈ సినిమాలో స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ చిత్రం కంప్లీట్ కాగానే ఎన్టీఆర్ కేజీఎఫ్ డైరెక్టర్ తో సినిమా చేయనున్నాడు. వీరి కాంబినేషన్ లో తెరకెక్కే ఈ మూవీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. పైన చెప్పిన డైరెక్టర్లతోనే కాకుండా ఎన్టీఆర్ లోకేష్ కనకరాజ్, సంజయ్ లీలా భన్సాలీ, అట్లీ, నాగ్ అశ్విన్ వంటి డైరెక్టర్లతో కూడా సినిమాలు తీయబోతున్నాడన్న వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఈ యంగ్ టైగర్ ఏకంగా ఓ హాలీవుడ్ సినిమానే నటించబోతున్నట్టుగా వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి, ‘ఆన్ బ్రేకబుల్, ది సిక్త్స్ సెన్స్, గ్లాస్ వంటి హాలీవుడ్ సినిమాలతో మాంచి పేరుతెచ్చుకున్న డైరెక్టర్ మనోజ్ నైట్ శ్యామలన్ తో ఎన్టీఆర్ ఓ సినిమా తీయబోతున్నాడని వార్తలు నెట్టింట్లో తెగ షికార్లు కొడుతున్నాయి. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇది నిజమో.. కాదో తెలియాలంటే మాత్రం కొంత కాలం వెయిట్ చెయ్యాలి.