తెలుగు ఇండస్ట్రీలో డాషింగ్
డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది
పూరి జగన్నాథ్ మాత్రమే ఎందుకంటే అంతకుముందు ఆయన తీసిన సినిమాలు చూస్తే మనకు అర్థమైపోతుంది.ఇడియట్,పోకిరి, దేశముదురు,
ఇస్మార్ట్ శంకర్ సినిమాలు చూస్తే
పూరి టాలెంట్ ఏంటో మన అందరికీ అర్థమవుతుంది. ప్రస్తుతం పూరిజగన్నాథ్ లైగర్
మూవీ తీస్తున్నారు.ఇంకేముంది
విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి, గీతగోవిందం లాంటి సినిమాతో
బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. ప్రస్తుతం డైరెక్షన్ లో ఫస్ట్ టైం పాన్
ఇండియా మూవీ చేస్తున్నాడు.బాక్సింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ
మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో లేడి సూపర్స్టార్ రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే.
బాహుబలి లాంటి
మూవీ లో రాజమాత శివగామి దేవిగా యాక్టింగ్ చేసి జనం అందరిని మెప్పించిన
రమ్య కృష్ణ ప్రస్తుతం ఈ
మూవీ షూటింగ్లో పాల్గొంటుంది. ఇదిలా ఉంటే ఈ
మూవీ కోసం రమ్యకృష్ణ ఊహించని లుక్లోకి మారిపోయింది. ఇటీవల విజయ్ దేవరకొండతో కలిసి లైగర్ షూటింగ్ సెట్స్లో తీసుకున్న ఓ ఫొటోను రమ్యకృష్ణ తన సోషల్ మీడియాలో అబిమానులతో పంచుకున్నారు. బేస్తవారి లుక్లో రమ్యకృష్ణ కనిపించారు. ఈ ఫొటోను చూసిన అభిమానులు షాక్కి గురి అవుతున్నారు.
కాగా సాధారణంగా పూరీ జగన్నాథ్ తల్లి పాత్రలను బలంగా రాస్తుంటారు. అమ్మ
నాన్న ఓ తమిళమ్మాయి, లోఫర్ చిత్రాల్లో తల్లి పాత్రలకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఇక ఇప్పుడు లైగర్లోనూ రమ్యకృష్ణ పాత్ర గుర్తుండిపోయే విధంగా పూరీ కథను రాసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్
బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. రోనిత్ రాయ్,
అలీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.ఇష్మార్ట్
శంకర్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన
మణిశర్మ ఈ మూవీలో అదిరిపోయే మ్యూజిక్ ని ఇచ్చారని ఇప్పటికే టాక్ వినిపిస్తుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం,
హిందీ భాషల్లో ఈ
మూవీ విడుదల కానుంది. 2019లో ఇస్మార్ట్ శంకర్ విజయం తరువాత పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ
మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన మోషన్
పోస్టర్ లో
విజయ్ లుక్ అదిరిపోయేలా ఉందని ప్రశంసలు వచ్చాయి.