ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... "బాహుబలి" సినిమాతో ప్రభాస్ పెద్ద పాన్ ఇండియా స్టార్ అయిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ హీరోలతో సమానంగా ప్రభాస్ నార్త్ ఇండియాలో క్రేజ్ సంపాదించాడు. అందుకే నిర్మాతలు రెబల్ స్టార్ తో సినిమా చెయ్యడానికి తెగ తాపత్రయపడుతున్నారు...ప్రస్తుతం రెబల్ స్టార్ నాలుగు సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇక మరో బడా ప్రొడక్షన్ హౌజ్ కూడా ప్రభాస్ కోసం ట్రై చేస్తోందట.దేశంలోనే ప్రఖ్యాత నిర్మాణ సంస్థ గా పేరొందిన యష్ రాజ్ ఫిలిమ్స్ కి దేశంలో ఎంత ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ బ్యానర్ లో సినిమా చేయాలని ఏ హీరోకీ అయినా ఉంటుంది. ఇక ఆ సంస్థ నుంచి వచ్చే సినిమాలు కూడా హై లెవెల్లో ఉంటాయి. కేవలం ఆ బ్యానర్ ను చూసి సినిమాకు వచ్చే ఆడియెన్స్ ఎంతో మంది ఉంటారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక నెక్స్ట్ ఆ సంస్థ ప్రభాస్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.



ధూమ్ 4 కోసం ప్రభాస్ ను కూడా సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నారట. మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కబోయే ధూమ్ 4పై గత ఏడాది నుంచి అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.ఇక ప్రభాస్ ను సెలెక్ట్ చేసుకుంటే పాన్ ఇండియా సినిమాగా తెరపైకి తీసుకురావచ్చని యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ చాలా బిజీగా ఉన్నాడు. మరి వారి ఆఫర్ కు రెబల్ స్టార్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి.ఇక రెబల్ స్టార్ ఒప్పుకుంటే కనుక ఫ్యాన్స్ ఆనందానికి ఇక హద్దులే వుండవు.. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


మరింత సమాచారం తెలుసుకోండి: