సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నప్పటికీ కొందరు మాత్రమే స్టార్ హీరోలుగా గుర్తింపు పొందుతారు. ఎందుకంటే వాళ్లకు నటన మీద ఉన్న ఇష్టమే వాళ్లను స్టార్ హీరోయిన్ గా మారుస్తుంది. అట్లాంటి స్టార్ హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి చాలా హిట్ సినిమాలు తీసి ఇండస్ట్రీలో తనకు తిరుగులేదని గుర్తింపు తెచ్చుకున్నాడు. చిరంజీవి మెగాస్టార్ అయినప్పుడే అందాల తార శ్రీదేవి కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. అయితే సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు మొదలవ్వడం, ఆగిపోవడం లేదా ఒక యాక్టర్ ని వేరే వాళ్లు రిప్లేస్ చేయడం వంటివి జరుగుతూనే ఉంటాయి. కొన్ని సినిమాలు అనౌన్స్ చేసిన తర్వాత ఆగిపోతాయి. కొన్ని ఎనౌన్స్ చేయకముందు సినిమా గురించి వార్తలు వస్తున్నప్పుడే ఆగిపోతాయి. సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత రూమర్స్ కూడా అంతే సహజం. అలా ఇద్దరు స్టార్ల గురించి ఒక వార్త ప్రచారం అయ్యింది. అదేంటంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ ఆన్ స్క్రీన్ పెయిర్స్ లో ఒకరు మెగాస్టార్ చిరంజీవి ఇంకా శ్రీదేవి. వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “జగదేక వీరుడు అతిలోక సుందరి” సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది.
వీరిద్దరి కాంబినేషన్ లో ఈ ఒక్క సినిమా మాత్రమే కాకుండా ఎస్పీ పరశురామ్, రాణికాసుల రంగమ్మ తో పాటు ఇంకా కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. అయితే, వీరిద్దరూ కలిసి జగదేకవీరుడు అతిలోకసుందరికి ముందే ఇంకా కొన్ని సినిమాల్లో నటించాల్సి ఉందట.వాటిలో ఒకటి “వజ్రాల దొంగ”. కోదండరామి రెడ్డి గారి దర్శకత్వంలో వజ్రాల దొంగ అనే సినిమా రూపొందిద్దామని అనుకున్నారు. ఇందులో, హీరోయిన్ గా శ్రీదేవిని అనుకున్నారు. ఈ సినిమాని శ్రీదేవి నిర్మిస్తాను అని చెప్పారట, దానితో పాటు కథలో కూడా కొన్ని మార్పులు చేయాలని అడగడంతో,  అది కుదరకపోవడంతో ఈ సినిమా షూటింగ్ స్టేజి వరకు రాలేదు అనే వార్తలు వినిపించాయి.చిన్న హీరోల సినిమాలే కాదు పెద్ద హీరోల సినిమాలు కూడా అప్పుడప్పుడు అయిపోతూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ సినిమా ఆగిపోవడానికి పర్టిక్యులర్ గా ఒక ప్రాబ్లం అని చెప్పలేం

మరింత సమాచారం తెలుసుకోండి: