ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ప్రముఖ కన్నడ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధృవ్ సర్జా హీరోగా నటించిన చిత్రం "పొగరు".నంద కిషోర్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కింది.. డి.ప్ర‌తాప్ ఈ సినిమాని నిర్మించాడు .చంద‌న్ శెట్టి, అర్జున్ జ‌న్యలు ఈ సినిమాకి సంగీతం అందించారు. వీరి సంగీతంలో రూపొందిన ‘కరాబు మైండు కరాబు’ అనే ఒక్క పాట.. ఈ డబ్బింగ్ సినిమా పై అందరి దృష్టి పడేలా చేసింది.భారీ అంచనాలని పెంచేసింది..కానీ ఫిబ్రవరి 19న విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను మ్యాచ్ చెయ్యడంలో విఫలమయ్యింది అనే చెప్పాలి. అయినప్పటికీ టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక మందన వంటి హాట్ హీరోయిన్ క్రేజ్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ నే నమోదు చేసింది ఈ చిత్రం...


ఇక ఈ సినిమా 4 రోజుల వసూళ్ల విషయానికి వస్తే...‘పొగరు’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.3.7కోట్ల బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.4.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 1.93 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకా 2.27 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఓ డబ్బింగ్ సినిమాకి ఈ ఓపెనింగ్స్ చాలా ఎక్కువే. కానీ బయ్యర్లు ఎక్కువ రేట్లకు కొనుగోలు చేశారు కాబట్టి.. వీక్ డేస్ లో సో సోగా పెర్ఫార్మ్ చేస్తే కుదరదు మరి.సోమవారం రోజున పర్వాలేదు అనిపించినప్పటికీ.. టార్గెట్ ఇంకా చాలా ఉంది కాబట్టి వసూలు చెయ్యడం కష్టమనే చెప్పాలి.చూడాలి ఇక ఈ సినిమా ఎంత వరకు కలెక్షన్స్ ని స్టడీగా రాబడుతుందో.... ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి....


మరింత సమాచారం తెలుసుకోండి: