జబర్ధస్త్ బ్యూటీ అనసూయ ప్రస్తుతం టీవీ షోల తో పాటు సినిమాల్లో రాణిస్తూ ఫుల్ బిజీగా వుంది. రంగస్థలం సినిమాలో ఈ భామ నటనతో యాంకర్స్ నటన లోను తక్కువ కాదని రుజువు చేసింది. ఈ సినిమా తరువాత బ్యూటీ క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం రవితేజ హీరోగా వస్తున్న ఖిలాడి సినిమాలో నటిస్తోంది.  అంతే కాకుండా అనసూయ కీలక పాత్రలో నటించిన థాంక్ యూ బ్రదర్ సినిమా విడుదల కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో అనసూయ ప్రెగ్నెంట్ లేడీగా కనిపించబోతుంది.ఇక విన్నర్ సినిమాలోను సాయి ధరమ్ తేజ్ పక్కన ఐటమ్ సాంగ్ లో స్టెప్పులేసి అలరించింది. దాంతో సినిమాలో అనసూయ ఐటమ్ సాంగ్ ఉంటే సినిమాకు ఎంతో క్రేజ్ వస్తుందని అటు దర్శకులు..ఇటు హీరోలు కోరుతున్నారు. దాంతో తాజాగా కార్తికేయ హీరోగా నటిస్తున్న "చావు కబురు చల్లగా" సినిమాలోనూ అనసూయ ఐటమ్ సాంగ్ లో అలరించచబోతుంది. అయితే ఈ భామ తాజాగా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుందట.

ఇకపై తాను ఐటమ్ సాంగ్స్ లో నటించనని అనసూయ తేల్చి చెబుతోంది. అంతే కాకుండా ఇప్పటి వరకు ఏ పాత్ర వచ్చినా ఒకే చెప్పిన అనసూయ ఇప్పుడు మాత్రం చాలా పాత్ర ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటుందట. నిజానికి ఇది అనసూయ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. అనసూయ నటన కంటే ఆమె అందానికే అభిమానులు ఎక్కువ ఉన్నారు. అనసూయ సినిమాల్లోకి వచ్చి నటించకముందే ఆమెకు ఎంతో మంది అభిమానులు అయ్యారు. దాంతో ఆమె అందాలు ఆరబోస్తూ ఐటమ్ సాంగ్స్ చేస్తే విజిల్స్ కొట్టారు. కానీ ఇప్పుడు ఐటమ్స్ సాంగ్స్ కే దూరంగా ఉంటానని చెప్పడం అభిమానులకు చెదువార్తే అవుతుంది. మరి షాకింగ్ నిర్ణయం తీసుకున్న అనసూయ ఇకపై నటనతో ఎంతమంది అభిమానులను సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: