యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్దే జంటగా రాధా కృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా రాధే శ్యాం. ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. విక్రమాదిత్య, ప్రేరణ పాత్రలో ప్రభాస్, పూజా హెగ్దేలు అదరగొట్టనున్నారు. ఇక ఈ సినిమా ను జూలై 30న రిలీజ్ ఫిక్స్ చేశారు. సినిమా టీజర్ ఈమధ్యనే రిలీజై అంచనాలు పెంచింది.

ప్రభాస్ రాధే శ్యాం నుండి ప్రతీ అప్డేట్ ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తుంది. లేటెస్ట్ గా సినిమా నుండి వచ్చిన లీకులు ఫ్యాన్స్ ను షాక్ అయ్యేలా చేస్తున్నాయి. అదేంటి అంటే ఈ సినిమాకు కింగ్ నాగార్జున నటించిన గీతాంజలి సినిమాకు లింక్ ఉందట. అదేంటి ఆ సినిమా ఎక్కడ.. ఈ సినిమా ఎక్కడ అని ఆలోచించవచ్చు. కాని ఆ సినిమా ఈ సినిమాకు ఈ సినిమాకు పోలిక ఎక్కడ అన్నది కన్ ఫ్యూజన్ గా ఉంది.

1989లో మణిరత్నం డైరక్షన్ లో నాగార్జున, గిరిజ షెట్టర్ జోడీగా నటించిన సినిమా గీతాంజలి. ఈ సినిమా నాగార్జునకు సూపర్ క్రేజ్ తెచ్చింది. అయితే ప్రభాస్ రాధే శ్యాం సినిమా కూడా గీతాంజలి తరహాలో ఉండబోతుందని టాక్ వచ్చింది. మరి గీతాంజలికి, రాధే శ్యాం కు సంబంధం ఏమిటో కాని ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రభాస్ ఈ సినిమాతో పాటుగా సలార్, ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలతో ప్రభాస్ మరోసారి నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకోనున్నాడు. ఈ సినిమాల తర్వాత నాగ్ అశ్విన్ సినిమా కూడా లైన్ లో ఉంది.                                         
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: