గతేడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అలవైకుంఠపురములో సినిమాతో తన కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్ టైనర్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని టాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాణసంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తుండగా ఇందులో తొలిసారిగా బన్నీకి జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఒక ప్రముఖ కోలీవుడ్ నటుడు విలన్ పాత్ర చేస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం తమిళనాడు పరిసర ప్రాంతాల్లో లేటెస్ట్ షెడ్యూల్ జరుపుకుంటున్నట్లు సమాచారం. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి బన్నీ ఫాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ నుంచి కూడా సినిమా పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. తెలుగుతో పాటు పలు ఇతర భారతీయ భాషల్లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమా ఈ ఏడాది స్వతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 13న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ సినిమాలో బన్నీ ఒక లారీ క్లీనర్ గా కనిపించనున్నారని అలానే రష్మిక కూడా పక్కా మాస్ పాత్ర చేస్తుందని అంటున్నారు.


కాగా హీరో హీరోయిన్లు ఇద్దరూ కూడా తమ తమ పాత్రల కోసం దాదాపుగా నిత్యం రెండున్నర గంటలపాటు మేకప్ వేసుకోవాల్సివస్తోందని తల దగ్గర నుంచి పాదాల వరకూ ప్రతి ఒక్క అంశం విషయమై యూనిట్ ఎంతో శ్రద్ధ తీసుకుంటుందని తప్పకుండా రేపు రిలీజ్ తర్వాత హీరో హీరోయిన్లు ఇద్దరి క్యారెక్టర్స్ ఆడియన్స్ ని ఎంతో అలరిస్తాయని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరి  ఎన్నో అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత ఏ రేంజి సక్సెస్ ని అందుకుంటుందో తెలియాలంటే కొన్ని నెలల వరకు వెయిట్ చేయక తప్పదు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: