రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఒకదాని తర్వాత మరొకటి సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా వేగవంతంగా ముందు కొనసాగుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బాహుబలి రెండు సినిమాలు కూడా దేశవిదేశాల్లో భారీ సక్సెస్ సాధించి ఆయనకు పాన్ ఇండియా స్టార్ గా విపరీతమైన క్రేజ్ తెచ్చి పెట్టిన విషయం తెలిసిందే. దాని తర్వాత సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సాహో సినిమా తెలుగులో ఆశించిన రేంజ్ లో సక్సెస్ కానప్పటికీ నార్త్ సహా పలు ఇతర భాషల్లో భారీ సక్సెస్ అందుకుంది.

ఇక దాని తర్వాత ప్రస్తుతం ప్రభాస్, రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా రాధేశ్యామ్. యు.వి.క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీస్ సంస్థలు కలిసి ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కావచ్చింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల రిలీజ్ అయి మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఇక దీంతో పాటు మరో వైపు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ మూవీ తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా కూడా చేస్తున్నారు ప్రభాస్. ఇక ఈ మూడు సినిమాలతో పాటు ప్రభాస్ అతి త్వరలో చేయనున్న భారీ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ కి నాగ అశ్విన్ దర్శకత్వం వహించనున్నారు.

భారీ పాన్ ఇండియా మూవీ గా వైజయంతి మూవీస్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ వాస్తవానికి వచ్చే నెలలో ప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పటికే వరుసగా మూడు సినిమాలు చేస్తూ షెడ్యూల్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్న రెబల్స్ స్టార్ ని మరి ఇంత ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని నాగ్ అశ్విన్ తమ సినిమా షెడ్యూల్ ని మరొక మూడు నెలలపాటు వాయిదా వేసినట్లు సమాచారం. అందుతున్న సమాచారాన్ని బట్టి వీరిద్దరి కలయికలో తెరకెక్కనున్న సినిమా జూన్ తర్వాత సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకరకంగా ప్రభాస్ ని మరింతగా కష్టపడటం ఇష్టం లేని నాగ అశ్విన్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతైనా అభినందనీయం అంటున్నారు విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: