మొదటి సినిమా ఉప్పెనతోనే దర్శకుడు బుచ్చిబాబు సన మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ కొత్త నటీనటులతో కొత్త దర్శకుడు హిట్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. కానీ బుచ్చిబాబు ఫస్ట్ సినిమాకే మెగా హీరోను పరిచయం చేసి తనను తాను ఇండస్ట్రీకి పరిచయం చేసుకున్నాడు. ఇక ఈ సినిమా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా పెద్ద హీరోల రికార్డులను సైతం బద్దలు కొడుతోంది. దాంతో బుచ్చి నెక్స్ట్ సినిమా ఎవరితో ఉండబోతుందన్న చర్చ ఎక్కువగా వినిపిస్తోంది. అయితే బుచ్చి టాలెంట్ చూసి ఉప్పెన నిర్మించిన మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్ తరవాత సినిమాను కూడా తమతోనే చేయాలని ఒప్పందం చేసుకుందట. దాంతో బుచ్చిబాబు తరవాత సినిమా డేట్స్ కూడా మైత్రీ వాళ్లదగ్గరే ఉన్నాయి. అయితే ఇప్పటికే బుచ్చిబాబు దగ్గర ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ కథ ఉండగా..ఆ కథకు ఎన్టీఆర్ ను హీరోగా అనుకున్నాడు.

అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నాడు . ఆర్ఆర్ఆర్ తరవాత త్రివిక్రమ్ తో ఒక సినిమాకు ఒకే చెప్పగా...ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయడానికి ఒకే చెప్పాడు. దాంతో ఎన్టీఆర్ డేట్స్ కాళీ అవ్వాలంటే మరో రెండేళ్లు ఈజీగా పడుతుంది. దాంతో స్పోర్ట్స్ డ్రామాను పక్కన పెట్టిన బుచ్చిబాబు మరో కథ రెడీ చేస్తున్నాడట. అయితే ఈ కథకు హీరోను వెతికిపెట్టే బాధ్యత మాత్రం మైత్రీ వాళ్ళకే అప్పజెప్పాడట. దాంతో ప్రస్తుతం ఆ కథకోసం మైత్రీ నాగ చైతన్యకు సెట్ చేసే ప్లాన్ చేస్తుంది. అయితే నాగ చైతన్య కూడా ప్రస్థుతం కాళీగా ఏమీ లేరు. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. దాంతో బుచ్చిబాబు టెంప్ట్ చేసే కథ చెబితే చైతూ కూడా ఒకే చెప్పే అవకాశం ఉంది. మరి నాగచైతన్య ఒకే చెప్తాడా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: