ఇటీవల వరుసగా కెరీర్ పరంగా పరాజయాలతో సతమతమవుతున్న నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక భారీ ప్రతిష్టాత్మక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలయ్య ఇందులో డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. అందులో ఒకటి మధ్యతరగతి రైతు పాత్ర కాగా మరొకటి అఘోరా తరహాలో సాగే పాత్ర అని సమాచారం.

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ మూవీపై నందమూరి ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. పైగా గతంలో బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు రెండూ కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో తప్పకుండా ఈ మూవీ కూడా భారీ బ్లాక్ బస్టర్ సాధించి వారిద్దరి కలయికలో హ్యాట్రిక్ నమోదు చేయడం ఖాయమని పలువురు భావిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు అది మూవీపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పరిచింది. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ మూవీ యొక్క టైటిల్ ఎనౌన్స్ మెంట్ ఉగాది పండుగనాడు ఉంటుందని అంటున్నారు.

అలానే ఈ సినిమాలో యాక్షన్ ఫైట్ సన్నివేశాలు ఎంతో అత్యద్భుతంగా ఉంటాయని ఇక ఈ సినిమాకి టైటిల్ గా మోనార్క్, గాడ్ ఫాదర్ వంటి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు యూనిట్ ఎక్కువగా గాడ్ ఫాదర్ టైటిల్ వైపే మొగ్గు చూపుతోందని అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది అని వార్తలు కూడా ప్రచారం అవుతున్నాయి. అయితే బాలయ్య-బోయపాటి సినిమాకు సంబంధించి పూర్తి వివరాల పై క్లారిటీ రావాలంటే రాబోయే ఉగాది పండుగ వరకు వెయిట్ చేయక తప్పదని అంటున్నారు విశ్లేషకులు. కాగా ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 28 న వరల్డ్ వైడ్ గా ఎంతో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: