మనుషుల వ్యక్తి గత జీవితాల్లోకి మీడియా వాళ్ళు వెళితే తిట్టిపోసే వాళ్ళు, అంతే కాకుండా మీడియా మీద ఆగ్రహంతో సోషల్ మీడియాలోకి వచ్చినటువంటి వాళ్ళు, ఇప్పుడు క్రమ క్రమంగా మీడియాని కూడా మించి పోతున్నారు. వారి పర్సనల్ లైఫ్ ని అడ్డగోలుగా మాట్లాడేటటువంటి వారి సంఖ్య ఓ రేంజ్ లో పెరిగిపోతూ ఉంది. తాజాగా ఓ భావ ప్రకటన మితి మీరిపోయి వ్యక్తిగత జీవితాన్ని చిన్నా భిన్నం చేసేసింది. ఎందుకు ఇంత పెద్ద మాట అనవలసి వచ్చింది అంటే....ఒక సెలబ్రిటీ వైఖరి గురించి ఇంత చర్చ మొదలయింది. ఇంతకీ ఆ సెలెబ్రెటీ ఎవరంటే..సురేఖ రాణి. ఈమె తెలుగు ప్రజలందరికి సుపరిచితురాలే. తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈ తార గురించి తాజాగా ఓ పెద్ద చర్చ మొదలైంది.

ఒకప్పుడు బెజవాడలో సిటీ కేబుల్ లో యాంకర్ గా తన కెరియర్ ని మొదలుపెట్టిన సురేఖ ఇపుడు పెద్ద సినీ ఆర్టిస్ట్ అయి బిజీ గా మారిపోయింది. ఇక ఈమె పర్సనల్ లైఫ్ విషయానికొస్తే మొదట్లో సురేఖ వాణికి తన భర్తతో విబేధాలు వచ్చాయి...కొంత కాలం తర్వాత సురేఖ భర్త రెండేళ్ల క్రితం చనిపోయారు, ఇది అందరికి తేలిసిందే. ఇదిలా ఉండగా ఇటీవలే సింగర్ సునీత రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇదే తరహాలో ఇప్పుడు
 సురేఖ వాణి కూడా మరో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ, అందుకు ఆమె కూతురు కూడా ఒప్పుకుంది అంటూ నానా వార్తలు వస్తున్నాయి. వీటిని రాసే వాళ్ళు కనీసం అది సురేఖ వాణి జీవితానికి ఎంతో ముఖ్యమైన విషయం అనికూడా లేకుండా ఇష్టమొచ్చినట్టు కల్పిత వార్తలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

కానీ ఇందులో ఎంత మాత్రం నిజముందో పూర్తిగా తెలుసుకోకుండానే ఇలాంటి వార్తలు వారి జీవితాల గురించి రాస్తే ఆ తర్వాత వారి కుటుంబంలో జరిగే అనర్ధాలకు వాళ్ళు ఏమి సమాధానం చెప్పాల్సి వారికీ అర్ధం కావడంలేదు. ఒకవేళ ఆ వార్తల్లో నిజమంటే రాయడం వేరు, కానీ ఇలా ఊహాగానాలు ఈ మధ్యకాలంలో ఎక్కువ అయిపోయాయి. అప్పట్లో మీడియా అయితే ఇప్పుడు ఇలాంటి వార్తలను స్ప్రెడ్ చేయడంలో సోషల్ మీడియా అంతకు మించిపోయింది అని మందిపడుతున్నారు. గతంలో ఇలాంటి కల్పిత వార్తలు అనసూయ, సుమ వాళ్ళ మీద కూడా వచ్చాయి అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: