మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ..ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా రాబోతున్న ఈ మూవీ లో చరణ్ తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ ధానయ్య నిర్మిస్తుండగా.. ఎంఎం కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ ఎవరి డైరెక్షన్లో నటిస్తాడనేది మొన్నటి వరకు సస్పెన్స్ గా ఉండేది. కానీ ఆ సస్పెన్స్ కు తెరదించారు నిర్మాత దిల్ రాజు.

రామ్ చరణ్ 15 వ చిత్రాన్ని శ్రీ‌వెంక‌టేశ్వ‌ర‌క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మించబోతున్నట్లు అది కూడా సంచలన డైరెక్టర్ శంకర్మూవీ ని డైరెక్ట్ చేస్తున్నట్లు తెలిపి మెగా అభిమానుల్లో ఆనందం నింపారు. ఈ మూవీ ప్రకటన వచ్చిన దగ్గరి నుండి ఈ మూవీ ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా..ఈ మూవీ లో చరణ్ ఎలా కనిపిస్తాడా..ఏ రోల్ చేస్తున్నాడు అనేదాని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయితే ఈ మూవీ లో చరణ్ తాలూకా పాత్ర ఇలా వుండబోతుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

గతంలో ఎప్పుడు చూడని పాత్రలో చరణ్ కనిపిస్తాడని , ఈ పాత్ర ద్వారా స‌మాజానికి ఓ మెసేజ్ ఇవ్వబోతున్నాడని అంటున్నారు. ప్రస్తుతం శంకర్ యూనిట్ అంత కూడా స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమయ్యారని అంటున్నారు. మరి ఆ పాత్ర ఎలా ఉంటుందనేది తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే. ప్రస్తుతం చరణ్ ఆర్ఆర్ఆర్ తో పాటు తండ్రి చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీ లో ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. దీనికి సంబందించిన షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాలలో జరుగుతుంది.                  

మరింత సమాచారం తెలుసుకోండి: