చిత్ర పరిశ్రమలో ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలీదు. ఇక చాల మంది ఒక్క అవ‌కాశం.. ఒక్క హిట్ అని సినీ ఇండ‌స్ట్రీలో ఆస‌క్తిగా ఎదురుచూసేవాళ్లు ఎంద‌రో. కానీ హిట్ వ‌చ్చిన ఎవ‌రినైనా ఇండ‌స్ట్రీ చూసే విధానం వేరుగా ఉంటుంది. అందలం ఎక్కిస్తుంది. అవ‌కాశాల‌తో పాటు ఇమేజ్‌ను క‌ట్ట‌బెడుతుంది. ఇప్పుడు వీట‌న్నింటినీ ఎంజాయ్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానా.  సుకుమార్ శిష్యుడు ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు గురించి తనదైన శైలిలో సినిమాను చిత్రీకరించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు,

ఇక రీసెంట్‌గా ఉప్పెన‌తో సెన్సేష‌న‌ల్ హిట్ కొట్టిన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో నెక్ట్స్‌ సినిమా చేయ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. నిజానికి మైత్రీ మూవీ మేక‌ర్స్‌లో ఉప్పెన త‌ర్వాత రెండు సినిమాలు చేసేలా బుచ్చిబాబు సానా అగ్రిమెంట్ ఉంద‌ట‌. ఉప్పెన త‌ర్వాత ఎన్నో అవ‌కాశాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఈ ద‌ర్శ‌కుడు మాత్రం మైత్రీ మూవీ మేక‌ర్స్‌లోనే సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాడ‌ట‌.

తాజా సమాచారం ప్రకారం.. బుచ్చిబాబు సానా రెండు సినిమాలు లైన్‌లో ఉన్నాయ‌ట‌. అందులో ముందుగా అక్కినేని అఖిల్‌తో సినిమా ఉంటుంద‌ని స‌మాచారం. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న అఖిల్.. నెక్ట్స్ మూవీని సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్నాడు. దీని త‌ర్వాత మూవీ కోసం అఖిల్‌కు క‌థ చెప్పాడ‌ట బుచ్చిబాబు. క‌థ న‌చ్చ‌డంతో అఖిల్ సినిమా చేయ‌డానికి ఓకే అన్నాడ‌ట‌.

అలాగే మ‌రో స్టార్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌. రీసెంట్ టైమ్స్‌లో ఎన్టీర్‌కు ఓ క‌థ‌ను వినిపించాడ‌ట బుచ్చిబాబు. ట్రిపులార్ త‌ర్వాత త్రివిక్ర‌మ్ లైన్‌లో ఉన్నాడు. దీని త‌ర్వాత బుచ్చిబాబు సినిమాను ట్రాక్ ఎక్కించాలా లేక ముందుగానే సెట్స్‌పైకి వెళ‌దామా అనే ఆలోచ‌నలో ఉన్నాడ‌ట ఎన్టీఆర్‌. గోదావ‌రి జిల్లా బ్యాక్‌డ్రాప్‌తో ల‌వ్‌స్టోరిగా ఉప్పెన‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు, త‌దుప‌రి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో అదే గోదావారి జిల్లాల కాన్సెప్ట్‌తో 1980లో చిత్రీక‌రించేలా ఓ క‌థ‌ను సిద్ధం చేసుకున్నాడ‌ని టాక్‌. మ‌రి ఉప్పెన ద‌ర్శ‌కుడితో ఎన్టీఆర్ సినిమా ఎంత వ‌ర‌కు ముందుకెళుతుందో తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: