ప్రస్తుతం టాలీవుడ్ లో వారసుల హంగామాతో పాటు బ్రదర్స్ హంగామా కూడ బాగా నడుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో అనేక కుటుంబాలకు చెందిన అన్న హీరోగా సినిమాలు చేస్తుంటే తమ్ముడు కూడ పోటీగా వస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న బ్రదర్స్ లిస్ట్ ఒకసారిగా పెరిగిపోతూ ఉండటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.  


ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరంజీవి కొన్ని దశాబ్దాలుగా మెగాస్టార్ గాకొనసాగుతూ ఉండగానే అతడి తమ్ముడు పవన్ కళ్యాణ్  తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా కొన్ని విషయాలలో చిరంజీవి కే పోటీ ఇచ్చే ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఇక నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన అన్నదమ్ములు కళ్యాణ్ రామ్  జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ హీరోలుగా కొనసాగుతున్నారు.



తారక్ టాప్ స్టార్ హీరోగా నిలబడితే కళ్యాణ్ రామ్ హీరోగానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా సినిమాలు చేస్తున్నాడు. ఇక అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు అర్జున్ ఇప్పటికే టాప్ హీరోగా స్థిరపడితే తమ్ముడు అల్లు శిరీష్ కూడ హీరోగా సెటిల్ అవ్వడానికి చాలాగట్టి ప్రయత్నాలు  చేస్తున్నాడు. అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగచైతన్య ఇప్పటికే యంగ్ హీరోగా సెటిల్ అయితే  అతడి తమ్ముడు  అఖిల్ వరస ఫ్లాప్ లతో సతమతమవుతు ఉన్న హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.  


వైవిధ్యమైన సినిమాలతో చైతన్య పేరు తెచ్చుకుంటే అఖిల్ కమర్షియల్ హీరోగా మారడానికి ఎదురు చూస్తున్నాడు. అదేవిధంగా అలానే మెగా మేనల్లుళ్లు సాయి తేజ్ వైష్ణవ్ తేజ్ లు కూడ పాపులర్ హీరోలుగా మారడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితులలో సాయి తేజ్ కంటే తన మొదటి సినిమాతోనే వైష్ణవ్ తేజ్ విపరీతమైన గుర్తిపు తెచ్చుకున్నాడు. వీరి బాటలోనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ సాయి గణేష్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దీనితో తెలుగు సినిమా రంగంలో ఒక వైపు వారసుల హంగామాతో పాటు బ్రదర్స్ మ్యానియా పెరిగి పోతోందా  అంటూ కామెంట్స్ వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: