నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ముందు నుంచి ఈ సినిమాకి సంబంధించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ముందు నుంచి ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు అని అందులో ఒకటి అఘోరా పాత్ర అని ప్రచారం జరుగుతూ వచ్చింది. ఆ విషయంలో క్లారిటీ రాలేదు కానీ ఈ సినిమాలో బాలకృష్ణ ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు అని అంటున్నారు. అదీ కాక సింహా, లెజెండ్ లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుంది కాబట్టి ప్రేక్షకుల్లో అంతకంతకు అంచనాలు పెరిగిపోతున్నాయి. 

అయితే ఈ సినిమా నిర్మాత కారణంగా సినిమా యూనిట్ అనేక ఇబ్బందులు పడుతుందని అంటున్నారు. నిజానికి ఈ సినిమా కథ ప్రకారం వారణాసిలో కూడా షూటింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ కరోనా కారణంగా ఏర్పడిన గ్యాప్ వల్ల తాను అంత భారీ బడ్జెట్ పెట్టుకోలేని నిర్మాత దర్శకుడికి తేల్చిచెప్పడంతో మధ్యలో బోయపాటి ఈ సినిమాకి అనేక మార్పులు చేర్పులు చేశారని అంటున్నారు. ఆ మార్పుల కారణంగానే ఇప్పుడు వికారాబాద్ సమీపంలో షూటింగ్ చేయడానికి వెళ్లారట. 

వికారాబాద్ మండలం కొటాల గూడెం అనే గ్రామంలో షూటింగ్ జరిపేందుకు వెళ్ళగా అక్కడ షూటింగ్ జరగడానికి ముందు గ్రామస్తులు వెళ్లి షూటింగ్ అడ్డుకున్నారు. ఈ సినిమాల షూటింగ్స్ వలన తమ పంట పొలాలు దెబ్బతింటున్నాయని దెబ్బతిన్నా కూడా గ్రామానికి ఏమైనా చేద్దాం అని ఆలోచన కూడా వారికి ఉండదని అందుకే తమ గ్రామంలో సినిమా షూటింగ్ చేయవద్దని వారు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది . అయితే నిర్మాత బడ్జెట్ లో కోత పెట్టడం వల్లనే ఇలా రకరకాల లొకేషన్స్ మారుస్తూ ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. ఈ సినిమాని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: