ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో  యువ హీరోయిన్ ప్రియ వారియర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. కన్నడంలో లవర్స్ డే అనే సినిమాలో నటించి  ఒక్క సినిమాతోనే దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించింది ఈ అమ్మడు.  ఇక సినిమా విడుదలకు ముందే తన కన్ను గీటుతో  సీన్ విడుదల కావడంతో ఇక ఈ ఒక్క సీన్ తోనే భారత సినీ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది ప్రియా వారియర్. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  అయితే ప్రియా వారియర్ నటించిన లవర్స్ డే సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఈ అమ్మడికి మాత్రం క్రేజీ ఎంతగానో పెరిగిపోయింది అని చెప్పాలి.



 ఇక లవర్స్ డే తర్వాత ఈ అమ్మడు వరుస ఆఫర్లు అందుకుంటూ వస్తుంది. అయితే ఇక ఇటీవలే తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా అడుగుపెట్టింది అన్న విషయం తెలిసిందే.  నితిన్ హీరోగా నటిస్తున్న చెక్  సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ప్రియా వారియర్. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ లో కూడా ప్రియా వారియర్ ఎంతో అందంగా కనిపించి ప్రేక్షకులను అలరించింది. ఇక మరికొన్ని రోజుల్లో నితిన్ హీరోగా నటించిన చెక్  సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది అన్న విషయం తెలిసిందే.



 ఇకపోతే చెక్  సినిమా గురించి ఇటీవలే మాట్లాడిన ప్రియా వారియర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి చెక్  సినిమా సరైనది అని అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా కథ వినకుండానే నటించేందుకు ఒప్పుకున్నాను అంటూ తెలిపింది ప్రియా వారియర్. ఈ సినిమాలో తన పాత్ర పేరు యాత్ర అంటూ తెలిపిన ఈ అమ్మడు.. ఇక సినిమాలో తన పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రతి డైలాగు అర్థం చేసుకుని తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నించానని.. ఎలాంటి హెల్ప్  లేకుండానే డైలాగ్స్ చెప్పాను అంటూ తెలిపింది. ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటున్నానని త్వరలో సొంతంగా డబ్బింగ్ చెప్పడానికి కూడా ప్రయత్నిస్తానని అంతేకాకుండా తెలుగులో ఒక పాట పాడాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది ప్రియ ప్రకాష్ వారియర్.

మరింత సమాచారం తెలుసుకోండి: