ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కృతి శెట్టి ప్రస్తుతం నానితో కలిసి శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే సుధీర్ బాబు తో కలిసి మరొక సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈమె సినిమా రంగంలోకి అడుగు పెట్టక ముందు మోడలింగ్ చేసేవారు. అనంతరం కొన్ని వాణిజ్య ప్రకటనలలో కనిపించారు. ఆ తర్వాత బాలీవుడ్ లో హృతిక్ రోషన్ కథానాయకుడిగా నటించిన 'సూపర్ 30' సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేశారు.

2019 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా ప్రముఖ మాథ్స్ టీచర్ ఆనంద్ కుమార్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు అనే విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఆనంద్ కుమార్ కి విద్యార్థినిగా కృతి శెట్టి నటించారు. నిజానికి సినిమాలో చాలా మంది విద్యార్థులు గా నటించగా.. వారిలో ఒకరిగా కృతి శెట్టి కనిపించారు. ఆమె నటించినవి కీలక సన్నివేశాలు కాకపోయినా మూడు సార్లు ఆమె వెండితెరపై తళుక్కుమన్నారు. పదిహేనేళ్ల వయసులోనే బాలీవుడ్ సినిమాలో ఆమె ఎంపిక కావడం నిజంగా విశేషం అనే చెప్పాలి.

ఇకపోతే ఆమె తొలిసారిగా ఉప్పెన సినిమాలో హీరోయిన్ గా నటించినప్పటికీ నటనలో బాగా పరిణితి చూపించి ఆశ్చర్యపరిచారు. విజయ్ సేతుపతి కనిపించిన కీలక సన్నివేశాల్లో కూడా కృతి శెట్టి తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. 17 వయసులోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన కృతి తన రెమ్యూనరేషన్ బాగా పెంచేశారని సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అయితే ఆమెకున్న అందం అభినయంతో పాటు నటనా ప్రతిభకు అరకోటి రూపాయలు పారితోషికం గా ఇచ్చినా తక్కువే కాదని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా అనేక సినిమా అవకాశాలు వస్తున్నాయి. అయితే ప్రాధాన్యత కలిగిన పాత్రలలో నటించడానికే ఆమె ఆసక్తి కనబరుస్తున్నారు. హీరో రామ్, ఎన్.లింగుస్వామి కాంబోలో వస్తున్న సినిమా లో కృతి శెట్టి ని హీరోయిన్ గా అనుకున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: