బాలకృష్ణ గత నాలుగు దశాబ్దాలుగా టాప్ హీరోగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే వస్తున్నాడు. ఆయన వ్యక్తిగత విషయానికొస్తే 1982లో వసుంధరాదేవి ని పెళ్లి చేసుకున్నాడు. ఈమె ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ప్రముఖ శ్రీ రామదాసు మోటార్ ట్రాన్స్ పోర్ట్ అధినేత అయిన దేవరపల్లి సుబ్బారావు గారి అమ్మాయి. స్వతహాగా వందల కోట్ల ఆస్థి కి అధిపతి ఈవిడ. వసుంధరాదేవి తన గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత బాలకృష్ణ ను పెళ్లి చేసుకుంది.. అయితే అప్పట్లో జరిగిన ఒక సంఘటన తలుచుకుంటే ఇప్పటికీ ఆమె సిగ్గు పడుతూనే ఉంటుంది..
అదేమిటంటే కాకినాడలో బాలకృష్ణ నటించిన "రామ్ రహీం" సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు, షూటింగ్ లో భాగంగా బాలకృష్ణ రిక్షా తొక్కే ఒక సీన్ తీస్తున్నప్పుడు, వసుంధర వాళ్ళ అమ్మ బాలకృష్ణ ని చూసి,అది షూటింగ్ అని తెలియక ఆశ్చర్యపోయి..! పాపం ఎన్టీఆర్ గారి అబ్బాయి బాలకృష్ణ ఇలా రిక్షా తొక్కుతున్నాడు ఏంటి.. ఎన్టీఆర్ గారి కొడుకు అయినప్పటికీ ఇలా రిక్షా తొక్కడం ఏంటి..? అని ఆమె చాలా బాధ పడ్డారట.. ఇక ఈ విషయం వసుంధర తో బాలకృష్ణ కు పెళ్లి జరిగిన తర్వాత వసుంధర వాళ్ళ బాలకృష్ణ కు చెప్పిందట..
అయితే బాలకృష్ణ ఫ్యామిలీ మొత్తాన్ని వసుంధర నే చూసుకుంటుందట. బాలకృష్ణ ఎప్పుడు ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను కొంచెం తక్కువ పట్టించుకుంటారు. కానీ తన ఆలోచనలు అన్నీ ఎప్పుడూ సినిమాలలోనే బిజీగా ఉంటూ, ఏం సినిమా చేయాలి..? తన ఫ్యాన్స్ కు ఏ సినిమా కావాలి.?వాళ్లు తమ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు..? అనే ఆలోచనలతో ఎప్పుడు గడుపుతూ ఉంటారట.. అటు ఆమె ఫ్యామిలీని, బాలకృష్ణ కెరీర్ని ఇలా అన్నిటినీ సమానంగా హాండిల్ చేస్తూ వస్తోందట..