మెగా ఫ్యాన్స్ రచ్చ మామూలుగా ఉండదు, వారికి వెండి తెర మీద తమ హీరోలు కనిపిస్తే వచ్చే ఆనందమే వేరు. సినిమా కధను వారు చూడరు, తమ హీరో పక్కన ఎవరు ఉన్నారు అన్నది కూడా అసలు పట్టించుకోరు. వారు చూపు ఎపుడూ మెగా హీరోల మీదనే ఉంటుంది. తమ హీరోలు తెర మీద చేసే నటనను చూసి హాలులో  ఫ్యాన్స్ కి పూనకాలే వస్తాయి.

ఇంతలా అల్లరల్లరి చేసే ఫ్యాన్స్ మరే హీరోల‌కూ లేరనే చెప్పాలి. ఇదిలా ఉంటే మెగా కాంపౌండ్ లో బోలెడ్ మంది హీరోలు ఉన్నారు. అందరూ ఇపుడు ఒకటిని మించి సినిమాలు చేస్తున్నారు. ఎవరెన్ని సినిమాలు చేసినా కూడా మెగా ఫ్యాన్స్ ఆశలు మాత్రం కొన్ని అలాగే ఉన్నాయి. అదేంటి అంటే మెగా హీరోలు మల్టీ స్టారర్ మూవీ  చేయాలి. ఇద్దరు హీరోలూ కలసి వెండి తెరకు నిండు తనం తేవాలి.

మరి ఆ ఆశలు నెరవేరుతాయా అంటే అవును అనే సమాధానం వస్తోంది. ఎవరో కాదు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలసి ఒక సినిమాలో కనిపిస్తారట. అది కూడా పాన్ ఇండియా లెవెల్ లో రూపొందే  సినిమాలోనట. ఈ సినిమాకు డైరెక్టర్ శంకర్ పనిచేస్తాడట. నిజంగా ఇది నిజం అయితే ఎంత బాగుణ్ణు అని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

అయితే ఇందులో సగం నిజం అయింది. అదెలా అంటే శంకర్ డైరెక్షన్ లో చరణ్ నటిస్తున్నాడు. ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో మరో కీలకమైన పాత్ర ఉందిట. అది సినిమాలో కొంత సేపు కనిపించినా దాని ప్రభావం చాలా ఎక్కువట. అటువంటి కీలకమైన పాత్రను పోషించడానికి పవర్ స్టార్ తయారుగా ఉన్నారా అన్నదే ఇపుడు పెద్ద ప్రశ్న. పవన్ కళ్యాణ్ ఓకే అంటే మాత్రం ఈ మూవీ ఎక్కడికో వెళ్ళిపోతుంది అని అంటున్నారు. ఇప్పటికే చరణ్ శంకర్ కాంబో సెట్ కాగానే ఇది రికార్డులు బద్దలు కొట్టే మూవీ అని అంతా కన్ ఫర్మ్ చేశారు. ఇందులో పవన్ కూడా జత కడితే మాత్రం థియేటర్లు మామూలుగా ఊగవు, ఫ్యాన్స్ జోష్ తో భూకంపాలే వస్తాయని అంటున్నారు. మరి పవన్ ఒప్పుకోవాలని అంతా కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: