పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో ఓ చిన్న పాత్రలో తాను నటిస్తున్నానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. 2 సంవత్సరాల క్రితం గెటప్ శ్రీను రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం లో కీలక పాత్ర లో నటించిన సంగతి తెలిసిందే. ఐతే మరొక సారి తన సినిమాలో నటించే అవకాశాన్ని శ్రీను కి పూరి జగన్నాథ్ కల్పించడం విశేషం.
ఇకపోతే ఖైదీ నెంబర్ 150 లో చిరంజీవి తో స్క్రీన్ షేర్ చేసుకున్న గెటప్ శ్రీను మరొకసారి మెగాస్టార్ తో కలసి వెండితెర పై నటించనున్నారట. ప్రస్తుతం రూపొందుతున్న ఆచార్య సినిమాలో ఓ మంచి పాత్రలో నటిస్తున్నానని గెటప్ శీను వెల్లడించారు. అన్నయ్య చిరంజీవి తో కలిసి నటించడం మరచిపోలేని అనుభూతి అని ఆయన చెప్పుకొచ్చారు. ఐతే 'రాజు యాదవ్' అనే సినిమాలో హీరోగా నటిస్తున్నట్టు గెటప్ శీను కన్ఫామ్ చేసి ఆశ్చర్యపరిచారు.
గతంలో సుడిగాలి సుధీర్ హీరో గా చేశారు కానీ ఆయన తొలి సినిమా హిట్ కాలేదు. ఇతర జబర్దస్త్ కమెడియన్లు కూడా హీరోగా పలు సినిమాలు చేశారు కానీ అవన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. మరి గెటప్ శ్రీను అయినా హీరోగా సక్సెస్ అవుతారో లేదో చూడాలి. ఏది ఏమైనా బుల్లితెర నటుడిగా తన నటనా ప్రస్థానం ప్రారంభించి వెండి తెరపై హీరోగా నటించే స్థాయికి ఎదిగిన గెటప్ శ్రీను జీవిత ప్రయాణం స్ఫూర్తిదాయకం.