ఇటీవల ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, రూలర్ సినిమాలతో ప్రేక్షకుల  ముందుకు వచ్చిన నందమూరి నటసింహం బాలయ్య, వాటి ద్వారా ఊహించని విధంగా ఫ్లాప్స్ మూటగట్టుకున్నారు. అయితే వాటి అనంతరం కొంత ఆలోచన చేసిన బాలయ్య, తన నెక్స్ట్ మూవీని బోయపాటి తో చేయడానికి సిద్ధమయ్యారు. గతంలో వీరిద్దరి కలయికలో తెరకెక్కిన సింహా, లెజెండ్ సినిమాలు రెండూ కూడా ఒకదానిని మించేలా మరొకటి సూపర్ డూపర్ హిట్స్ కొట్టిన విషయం తెలిసిందే.
దానితో తప్పకుండా బోయపాటి తో అయితే తమ కాంబోలో మరొక సూపర్ హిట్ కొట్టవచ్చని భావించిన బాలయ్య ఆయనకు ఛాన్స్ ఇచ్చినట్లు టాక్. అదేవిధంగా బాలయ్య అంటే అమితమైన ఇష్టం గల బోయపాటి కూడా తమ కాంబో మూవీ స్టోరీ ని ఎంతో అత్యద్భుతంగా గ్రాండ్ లెవెల్లో సిద్ధం చేసి ప్రస్తుతం దానిని తెరకెక్కిస్తున్నట్లు టాక్. మంచి మాస్ యాక్షన్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకుంది. ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా బాలయ్య ఇందులో రెండు పాత్రలు చేస్తున్నట్లు టాక్. కాగా ఈ సినిమా మే 28న రిలీజ్ కానుంది.

అయితే దీని తరువాత క్రాక్ మూవీ దర్శకుడు గోపీచంద్ మలినేని తో బాలయ్య ఒక సినిమా చేయనున్నారు, అలానే ఆ ప్రతిష్టాత్మక మూవీని మా బ్యానర్ పై నిర్మించనున్నాం అంటూ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పారు. అసలు మ్యాటర్ ఏమిటంటే నిన్న బాలయ్య ని ప్రత్యేకంగా కలిసిన గోపీచంద్, ఆయనకు అద్భుతమైన స్టోరీ ని విపించినట్లు తెలుస్తోంది. మంచి యాక్షన్, ఎంటర్టైన్మెంట్ తో కూడిన ఈ మూవీ అతి త్వరలో మొదలు కానున్నట్లు సమాచారం. ఇక బాలయ్యని కలిసిన సందర్భంగా దిగిన ఫోటోని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేశారు గోపీచంద్. కాగా ఈ కాంబినేషన్ మూవీ తప్పకుండా సూపర్ హిట్ కొడుతుందని పలువురు ప్రేక్షకాభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: