వెంకటేశ్‌ లిస్ట్‌లో మరో రీమేక్‌ చేరుతోంది. ఇప్పటికే రెండు రీమేక్‌లతో బిజీగా ఉన్న వెంకటేశ్, ముచ్చటగా మూడో రీమేక్‌ కూడా చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. మళయాళం సూపర్‌ హిట్ ప్రాంచైజీలో మరో సినిమాని రీమేక్‌ చేస్తాడనే టాక్ వస్తోంది.

వెంకటేశ్ ఇప్పుడు 'నారప్ప'తో బిజీగా ఉన్నాడు. తమిళ హిట్‌ 'అసురన్' రీమేక్‌గా తెరకెక్కుతోందీ సినిమా. ఇక 'నారప్ప' పోస్ట్‌ప్రొడక్షన్స్‌లో ఉండగానే మరో రీమేక్ అనౌన్స్ చేశాడు వెంకటేశ్. మోహన్‌లాల్, మీన సూపర్‌హిట్ మూవీ 'దృశ్యం2'ని రీమేక్ చేస్తానని చెప్పాడు. అయితే ఇంకా 'దృశ్యం2' స్టార్ట్‌ కాకముందే వెంకీ 'దృశ్యం3' కూడా రీమేక్ చేస్తాడనే ప్రచారం జరుగుతోంది.

జీతు జోసెఫ్ దర్శకత్వంలో మోహన్‌లాల్, మీన లీడ్‌ రోల్స్‌ ప్లే చేసిన సినిమా 'దృశ్యం'. మళయాళంలో ఈ మూవీ సక్సెస్‌ కాగానే, 'దృశ్యం' రీమేక్ చేశాడు వెంకటేశ్. ఇక రీసెంట్‌గా అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజైన 'దృశ్యం2'కి పాజిటివ్ రెస్పాన్స్‌ వచ్చిన వెంటనే ఈ సీక్వెల్‌కి కూడా రీమేక్ అనౌన్స్‌ చేశాడు విక్టరీ హీరో.

జీతు జోసెఫ్‌కి 'దృశ్యం3' కూడా తీసే ఆలోచన ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు నిర్మాత ఆంటొని పెరుంబవూర్. దీంతో మళయాళంలో 'దృశ్యం3' హిట్ అయితే, వెంకటేశ్ కూడా 'దృశ్యం3' చేస్తాడనే ప్రచారం మొదలైంది. వెంకీ లిస్ట్‌లో మరో రీమేక్‌ మూవీ చేరుతుందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.

మొత్తానికి విక్టరీ వెంకటేశ్ కు వయసు పెరుగుతున్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు. వరుసగా రీమేక్ లు చేస్తూ ఫ్యాన్స్ కు పండుగ వాతావరణం సృష్టిస్తున్నాడు. అందులో భాగంగానే తమిళ్ హిట్ అసురన్ రీమేక్ చేస్తూ ఫ్యాన్స్ లో ఉత్కంఠ రేపుతున్నాడు. నారప్పగా తమిళ హిట్ అసురన్ రావడం విశేషం. ఇక మే 14న నారప్ప విడుదల కావడం ఇప్పుడు అభిమానుల్లో సస్పెన్స్ పెంచుతోంది. అంతేకాదు దృశ్యం 2 కోసం కూడా వెంకటేశ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: