ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌మెడియ‌న్ అలీ ఎంత మంచి స్నేహితులో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎన్నో సినిమాల్లో క‌లిసి న‌టించిన వీళ్లు బయ‌ట కూడా మంచి మిత్రుల‌ని టాక్ ఉంది. అయితే 2018 ఎన్నిక‌ల్లో అలీ వైసీపి నుండి గుంటూరు టికెట్ ఆశించడం కానీ టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో వైసీపీ కి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం జ‌రిగింది. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా రాజమండ్రి పర్యటనలో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. అలీ తనకు మిత్రుడని కానీ తనతో కలవకుండా వైసీపీ లో చేరి జగన్ కు సపోర్ట్ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా అలీ చెప్పిన అభ్యర్థికే జనసేన తరపున టికెట్ ఇచ్చినా చెప్పకుండా వెళ్లి వైసీపీ లో చేరారని అన్నారు. అలీ కష్టాల్లో ఉన్నప్పుడు తాను సహాయం చేశానని తనతో కలిసి పని చేస్తా అని చెప్పి ఇప్పుడు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్లి వైసీపీ లో చేరారని అన్నారు. అంతే కాకుండా ఇప్పుడు తాను రాజకీయాలకు పనికి రానని అలీ ఎలా డిసైడ్ చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పవన్ వ్యాఖ్యలపై అలీ సైతం కౌంటర్ వేశారు. నాకు పవన్ సహాయం చేసారా...ఎప్పుడు చేశారు. ఎలా చేశారు.

నేను పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందే భాగా సెటిల్ అయ్యాను. ఖాళీగా ఉంటే ఆయన నాకు అవకాశాలు ఇప్పించారా..డబ్బులు ఇప్పించారా.? తాను వైసీపీ లో చేరకూడదని రాజ్యాంగం లో రాసి ఉందా అంటూ ప్రశ్నించారు. ఇదిలా ఉండగా ఇప్పుడు అలీ రూటు మార్చి తమ మధ్య ఏమీ జరగలేదని అంతా మీడియానే చేసిందని అనడం విడ్డురంగా ఉంది. ప్రస్తుతం అలీ నటిస్తున్న ఓ సినిమా కార్యక్రమంలో భాగంగా అలీ మాట్లాడుతూ.. పవన్ కు తనకు మధ్య ఎలాంటి విబేధాలు లేవని అన్నారు. లాంగ్ గ్యాప్ తరవాత పవన్ ను కలిసింది వాస్తవమేనని..కలిసినప్పుడు పవన్ ఎలా ఉన్నవని అడిగారని బాగున్నా అని చెప్పానని మళ్ళీ కలుద్దామని చెప్పారన్నారు. తర్వాత మళ్ళీ కలవాలని ప్రయత్నించగా ఆయన పూణేలో ఉన్నారని అన్నారు. 2021 లో తాము కలిసి ఒక సినిమాలో నటించినా ఆశ్చర్యం లేదన్నారు. అంతే కాకుండా తమ మధ్య విబేధాలు సృష్టించింది మీడియానే అని వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: