పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి మళ్ళీ రి ఎంట్రీ ఇస్తున్నాడు అంటే అందరి నిర్మాతలు ఆయన చుట్టూ చేరి వరసగా సినిమాలని సైన్ చేపించుకున్నారు. అందులో మొదటి
సినిమా హిందీ పింక్ సినిమా రీమేక్ వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకి రెడిగా ఉంది.ఈ
సినిమా తర్వాత
పవన్ కళ్యాణ్ 27 వ చిత్రం క్రిష్ దర్శకత్వంలో రాబోతుంది. ఈ సినిమాని ఇప్పటిదాకా ఆయన సినిమాల బడ్జెట్
కన్నా ఎక్కువ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు
నిర్మాత ఏ యమ్ రత్నం . అలాగే మొదటిసారి
కీరవాణి సంగీతంలో
పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ
సినిమా రాజుల కాలంలో జరిగే కథతో రాబోతుంది. ఇందులో
పవన్ కళ్యాణ్ ఒక
దొంగ గా కనిపించబోతున్నాడు. అయితే ఈ
సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బైటకి వచ్చింది. అదేంటి అంటే ఈ సినిమాలో
పవన్ కళ్యాణ్ ఒక పాట లో 200 మంది డాన్సర్స్ తో స్టెప్స్ వేశరట. ఈ పాటని ప్రముఖ డాన్స్
మాస్టర్ గణేష్
మాస్టర్ కోరియోగ్రఫీ చేశారు. ఈ విషయాన్ని గణేష్
మాస్టర్ ఈ మద్యనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ పాట థియేటర్స్ లో అభిమానులతో డాన్సులు వేపిస్తుందని ఆయన అన్నారు. అయితే ఈ రేంజ్ డాన్సర్స్ తో
పవన్ కళ్యాణ్ డాన్స్ వెయ్యడం ఇదే మొదటిసారి. ఇక
కీరవాణి సంగీతం ,
పవన్ కళ్యాణ్ డాన్సులు ఈ పాటకి పెద్ద హైలైట్ అవుతుంది అని ఆయన అన్నారు. ఇక ఈ
సినిమా మీద
పవన్ కళ్యాణ్ అభిమానులే కాకా ఇండస్ట్రీలో అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ
సినిమా వచ్చే ఏడాది కానీ ఈ ఏడాది చివరిలో గాని విడుదల అవుతుంది అని అందరి అంచనా. కథానాయకుడు , మహనాయకుడు సినిమాల ఫలితాలతో డీలా పడిన
క్రిష్ ఈ సినిమాతో మళ్ళీ సత్తా చాటాలని అనుకుంటున్నాడు.