రన్ రాజా రన్ లాంటి  సినిమా తో వచ్చి ప్రేక్షకులను మెప్పిచ్చిన సుజిత్ తన రెండో సినిమానే ప్రభాస్ తో చేయడం అంటే పెద్ద అచీవ్ మెంట్ అని చెప్పాలి.. అయితే ప్రభాస్ లాంటి నేషనల్ స్టార్ తో పాన్ ఇండియా సినిమా చేసినా దర్శకుడు సుజిత్ కి తన తర్వాతి చిత్రానికి హీరో ఇప్పటివరకు దొరకలేదు. సాహో సినిమా రిలీజ్ అయ్యాక కానీ సుజిత్ పరిస్థితి ఏంటో అర్థం కాలేదు.. సాహో సినిమా ఫ్లాప్ అవడంతో ఈ దర్శకుడి సినిమా రాత చాలా మారిపోయిందని చెప్పొచ్చు. అదే హిట్ అయితే టాలీవుడ్ లోని టాప్ హీరోలు అందరు ఈ దర్శకుడి కోసం క్యూలు కట్టేవారు..

ఆమధ్య చిరంజీవి తో సినిమా అంటూ కొంత స్క్రిప్ట్ వర్క్ చేసిన ఎందుకో ఆ సినిమా వర్కౌట్ అవలేదు. చిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే..  ఆ సినిమా తర్వాత రాబోయే  లూసిఫర్ రీమేక్ కి మొదట్లో సుజిత్ దర్శకత్వం వహిస్తాడు అనుకున్నా స్క్రిప్ట్ తో మెప్పించలేక సడెన్ గా సుజిత్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.. ఆ తరువాత దీనికి తమిళ దర్శకుడు మోహన్ రాజా ఎంపిక అయ్యాడు.

తెలుగులో బిలో యావ‌రేజ్ గా నిలిచిన సాహో.. బాలీవుడ్ లో మాత్రం మంచి వ‌సూళ్లు సాధించింది. అందుకే.. సుజిత్ ని తెలుగు నిర్మాత‌లు ప‌ట్టించుకోక‌పోయినా బాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది.అక్క‌డి జీ స్టూడియోస్ సుజిత్ తో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. సుజిత్ వాళ్ల కోసం ఓ భారీ యాక్ష‌న్ చిత్రాన్ని తీయ‌బోతున్నాడు. ఈ యేడాదే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. అయితే ఇందులో న‌టించే హీరో ఎవ‌రో డిసైడ్ అవ్వ‌లేదు. బాలీవుడ్ కి చెందిన ఓ అగ్ర క‌థానాయ‌కుడే న‌టిస్తాడ‌ని తెలుస్తోంది. మ‌రి కొద్ది రోజుల్లో హీరో ఎవ‌ర‌న్న విష‌యంలో ఓ క్లారిటీ వ‌స్తుంది. అయితే ఈసారి యాక్ష‌న్ తో పాటు, ఎమోష‌న్ డ్రామాని కూడా మిక్స్‌చేశాడ‌ని సుజిత్ చెబుతున్నాడు. ఈసారైనా... త‌న ప్ర‌య‌త్నం పూర్తి స్థాయిలో నెవ‌రేరుతుందో, లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: