ఆమధ్య చిరంజీవి తో సినిమా అంటూ కొంత స్క్రిప్ట్ వర్క్ చేసిన ఎందుకో ఆ సినిమా వర్కౌట్ అవలేదు. చిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఆ సినిమా తర్వాత రాబోయే లూసిఫర్ రీమేక్ కి మొదట్లో సుజిత్ దర్శకత్వం వహిస్తాడు అనుకున్నా స్క్రిప్ట్ తో మెప్పించలేక సడెన్ గా సుజిత్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.. ఆ తరువాత దీనికి తమిళ దర్శకుడు మోహన్ రాజా ఎంపిక అయ్యాడు.
తెలుగులో బిలో యావరేజ్ గా నిలిచిన సాహో.. బాలీవుడ్ లో మాత్రం మంచి వసూళ్లు సాధించింది. అందుకే.. సుజిత్ ని తెలుగు నిర్మాతలు పట్టించుకోకపోయినా బాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది.అక్కడి జీ స్టూడియోస్ సుజిత్ తో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. సుజిత్ వాళ్ల కోసం ఓ భారీ యాక్షన్ చిత్రాన్ని తీయబోతున్నాడు. ఈ యేడాదే ఈ సినిమా సెట్స్పైకి వెళ్తుంది. అయితే ఇందులో నటించే హీరో ఎవరో డిసైడ్ అవ్వలేదు. బాలీవుడ్ కి చెందిన ఓ అగ్ర కథానాయకుడే నటిస్తాడని తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లో హీరో ఎవరన్న విషయంలో ఓ క్లారిటీ వస్తుంది. అయితే ఈసారి యాక్షన్ తో పాటు, ఎమోషన్ డ్రామాని కూడా మిక్స్చేశాడని సుజిత్ చెబుతున్నాడు. ఈసారైనా... తన ప్రయత్నం పూర్తి స్థాయిలో నెవరేరుతుందో, లేదో చూడాలి.