అ..ఆ సినిమాతో తెలుగులోకి పరిచయం అయిన అనుపమ పరిమేశ్వరన్. ఆ సినిమా తర్వాత వరసగా తెలుగులో నటిస్తూ బిజీగా ఉంది.ఇక అనుపమ సినిమాల్లోనే కాదు , సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్. తన ఫొటో షూట్స్ తో టిక్ టాక్ వీడియోస్ తో ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది.ఇక ప్రస్తుతం అనుపమ తెలుగులో నిఖిల్ తో కలిసి 18 పేజిస్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకి కథ సుకుమార్ అందించారు. కుమారి 21ఎఫ్ సినిమా దర్శకుడు సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో సుకుమార్ బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా నడుస్తుంది. త్వరలోనే ఈ లవ్ స్టొరీ సినిమా విడుదల కాబోతుంది.అయితే అనుపమ ఇప్పుడు నిఖిల్ తో కలిసి ఇంకొక సినిమా కూడా చేస్తుంది. 18 పేజెస్ తర్వాత ఆమె చేయబోయే క్రేజ్ ప్రాజెక్ట్ ఏంటి అంటే కొన్ని సంవత్సరాల క్రితం వచ్చి సూపర్ హిట్ అయిన నిఖిల్ కార్తికేయ సినిమాకి రెండో పార్ట్ గా రాబోతున్న  కార్తికేయ 2 లో అనుపమ ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా మొదటి పార్ట్ లో కలర్స్ స్వాతి నటించి మెప్పించింది. ఇక ఈ రెండో పార్ట్ టైం కి కలర్స్ స్వాతి కి పెళ్లి జరిగిపోవడంతో ఈ సినిమాలో అనుపమని ఎంపిక చేసారు. ఇక అనుపమ కి ఇప్పటిదాకా తెలుగులో ఒక మంచి హిట్ రాలేదు. ఇక ఈ సుకుమార్ కథని అందిస్తున్న 18 పేజెస్ మరియు నిఖిల్ కార్తికేయ లో ఏదో ఒక సినిమా హిట్ అయితే అనుపమ కి ఇంకా క్రేజ్ పెరిగే ఛాన్స్ చాలా ఉంది. ఈ మధ్యనే అనుపమ నటించిన ఒక షార్ట్ ఫిల్మ్ కూడా బాగా ట్రెండ్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: