ఎన్నో అంచనాలు మధ్య, వైష్ణవ్ తేజ్ నటిస్తున్న  ఉప్పెన సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి మంచి హిట్ ని సాధించింది.ఎంతో న్యాచురల్ గా సినిమా తెరకెక్కగా మంచి టాక్ ని అయితే తెచ్చుకుంది.. వైష్ణవ్ నటిస్తున్న మొదటి సినిమా కావడంతో సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి.. ప్రేక్షకులు, మెగా అభిమానులు ఏ అంచనాలను అయితే పెట్టుకున్నాడో ఆ అంచనాలను అయితే వైష్ణవ్ అందుకున్నాడు. తన యాక్టింగ్ తో అందరిని మెస్మరైజ్ చేశాడు.

సినిమా తో కృతి శెట్టి టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. ఆమెకు ఇప్పుడు ఓ అరడజను సినిమాలు లైన్ లో ఉన్నాయి.ఈ సినిమా లో నటనతో అందరి హృదయాలను కట్టిపడేసింది కృతి.. మొద‌టి సినిమాతోనే విప‌రీత‌మైన క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమాతో వ‌చ్చిన క్రేజ్ తో కృతి శెట్టి త‌న రెండో సినిమాకు ఏకంగా 75ల‌క్ష‌ల‌ను డిమాండ్ చేస్తోంద‌ని టాక్. ఉప్పెన సినిమా విడుద‌లకు ముందు నుంచి విడుద‌ల అయిన త‌ర్వాత కృతి శెట్టి గురించి విప‌రీత‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. చూడ్డానికి ఎంతో చిన్న పిల్లలా క‌నిపించే ఈ అమ్మ‌డు గురించి సోష‌ల్ మీడియాలో ఎక్కువ మంది చ‌ర్చిస్తున్నార‌ట‌.  

ఇదిలా ఉంటే  మన దగ్గర కొత్త కంటెంట్ తో ఓ సినిమా భారీ హిట్ అయితే దాని రీమేక్ కు ఎలాంటి డిమాండ్ ఏర్పడుతుందో కూడా తెలుసు. ఆలా ఇప్పటికే సేతుపతి తమిళ్ రీమేక్ హక్కులను కొనుగోలు చేసేసారు. అంతే కాకుండా అక్కడ సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. కానీ లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ చిత్రం బాలీవుడ్ రీమేక్ కు కూడా సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. అక్కడి యువ స్టార్ హీరో ఇషాన్ ఖట్టర్ మరియు సెన్సేషనల్ హీరోయిన్ అనన్య పాండే నటించనున్నట్టు తెలుస్తుంది. మరి అలాగే దీనిపై ఒక అధికారిక క్లారిటీ కూడా రానుంది అట. మరి అక్కడ ఈ చిత్రం ఎంత సెన్సేషన్ సెట్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: