త్వరలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. సయేశా సైగల్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది.. తమన్ సంగీతం అందిస్తుండగా ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.ఇటీవలే ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్ కు ప్రేక్షకులనుండి మంచి స్పందన వచ్చింది. ఇందులో పంచెకట్టులో మీసం మెలితిప్పుతూ మాస్ లుక్ లో బాలయ్య అలరించాడు. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తుండగా.. అందులో ఒకటి అఘోర పాత్ర.. రెండోది ఫ్యాక్షనిస్ట్ పాత్ర అని సమాచారం.
ఇకపోతే ఈ సినిమా చేస్తుండగానే బాలయ్య మరిన్ని కథలు విన్నారన్న సంగతి తెలిసిందే. మరి ఈ సమయంలోనే వినిపించిన దర్శకుడు పేరు గోపిచంద్ మలినేని. ఈ ఏడాది ఆరంభమే “క్రాక్” అనే మైండ్ బ్లోయింగ్ బ్లాక్ బస్టర్ ను ఇచ్చి అదరగొట్టారు. ఇక అక్కడ నుంచి బాలయ్య తో కూడా ఒక చిత్రం ఉందని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ కాంబోలో సినిమా ఫిక్స్ అయ్యిపోయిందని తెలుస్తుంది. నిన్న దర్శకుడు చాలా సింపుల్ పోస్ట్ తోనే కన్ఫర్మ్ చేసేసారు. దీనితో ఈ కాంబో సెట్ అయ్యినట్టే ఖరారు అయ్యిపోయింది అని అభిమానులు ఫిక్స్ అయ్యారు. మరి ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.