సూపర్ స్టార్ మహేష్ బాబు చాల రోజుల గ్యాప్ ఇచ్చి మరీ సర్కార్ వారి పాట సినిమా ని చేస్తున్నాడు . కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కి పరశురామ్ దర్శకుడు.. సరిలేరు నీకెవ్వరూ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా పై మహేష్ అభిమానులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.  గీత గోవిందం లాంటి క్లాసిక్ హిట్ కొట్టిన పరశురామ్సినిమా కి దర్శకుడు కావడంతో మహేష్ తో సినిమా ను ఎలా చేస్తాడో అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తమన్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్ గా నిలవనుంది. ఇప్పటివరకు వీరి కాంబోలో వచ్చిన సినిమాలు అన్ని మ్యూజికల్ హిట్ గా నిలిచాయి. ఇది కూడా అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారట..ఈ మాస్ సినిమాకు గాను థమన్ వీరి కాంబోపై ఉండే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఒక మాస్ సాంగ్ ను కూడా రెడీ చేసారని తెలుస్తుంది. ఇదిలా ఉండగా గత కొన్నాళ్ల కితమే ఈ సినిమాలో ఓ సాంగ్ కు గాను ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ చేస్తున్నారని టాక్ వచ్చింది.

వీరి కాంబోలో ఇంతకు ముందు వచ్చిన “సరిలేరు నీకెవ్వరు” నుంచి మైండ్ బ్లాక్ సాంగ్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఇందులో కూడా ఓ సాంగ్ చెయ్యనున్నారని ఆయా మధ్య టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు అది నిజమే అన్నట్టు తెలుస్తుంది. మరి ఈసారి ఏ రేంజ్ దుమ్ము లేపుతారో చూడాలి. ఇప్పటికే వచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ చాలామందిని ఆకట్టుకుంది.. మహేష్ ని ఇలా మునుపెన్నడూ చూడలేదని అంటున్నారు.. అంతా సవ్యంగా జరిగితే మహేష్ బాబు ఇప్పటికే అమెరికాలో సర్కారు వారి పాట షూటింగ్ మొదలుపెట్టేవాడు. కానీ  కరోనా కారణంగా ఆగిపోయింది.. ఈ సినిమా లో మహేష్ ద్విపాత్రాభినయం చేస్తుండడం విశేషం.. బాలీవుడ్ నటుడిని విలన్ గా ఎంపిక చేసే విధంగా ఆలోచనలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: