రెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా ని పూర్తి చేసే పనిలో ఉన్నారు..  జిల్ దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వంలో వస్తున్న రాధే శ్యామ్ సినిమా ని యూవీ క్రియేషన్స్ బ్యానర్, గోపికృష్ణ మూవీస్ బ్యానర్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండగా పూజ హెగ్డే కథానాయిక గా నటిస్తుంది.యర్ కామ్రేడ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన జస్టిన్ ఈ సినిమా తో ఎలా మెప్పిస్తాడా అనేది చూడాలి. సాహో సినిమా వచ్చి చాల రోజులే అయిపొయింది.. ఈ నేపథ్యంలో రాధే శ్యామ్ సినిమా ని సమ్మర్ లో విడుదల చేసి గ్యాప్ ఎక్కువ లేకుండానే అయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సలార్ ని రిలీజ్ చేయాలనీ ప్లాన్  వేశాడు..

ఇక ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ చిత్రా ఒకటి ఆదిపురుష్..   హిందీ మెరియు తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఈ సినిమా. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా దర్శకుడు ఓంరౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ రామునిగా సైఫ్ అలీఖాన్ రావణ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంపై ఓంరౌత్ కొన్ని ఇంట్రెస్టింగ్ డీటైల్స్ ను బయటపెట్టినట్టు తెలుస్తుంది. ఇలాంటి సబ్జెక్టు ను చెయ్యడం చాలా టఫ్ పని అని, అలాగే ప్రపంచంలోని హాఫ్ బిలియన్ ప్రేక్షకులకు తనకి చాలా ముఖ్యమైనదని అంతే కాకుండా ఇందులోని ఒక్కో పాత్రలోని భిన్నమైన కోణాన్ని ప్రతీ ఒక్కరు తెలుసుకుంటారని కూడా తెలిపారు.

అలాగే ఆ మధ్య సైఫ్ చేసిన కొన్ని సంచలన కామెంట్స్ పై కూడా స్పందించారు. ఆ మ్యాటర్ అప్పటితోనే ముగిసిపోయింది అని ఒక విషయం ఇంకొకలా ప్రొజెక్ట్ అయ్యిందని లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మరి ఈ చిత్రానికి గాను భారీ విజువల్ ఎఫెక్ట్స్ ను ప్లాన్ చేస్తుండగా ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు 8న 2022కి విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: