పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా పూర్తి చేసి ఏకే రీమేక్ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కి త్రివిక్రమ్ రచన చేస్తుండగా వకీల్ సాబ్ తర్వాతే ఈ సినిమా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. ఇప్పటికే  ఎనభై శాతం పూర్తయ్యింది.. త్వరలోనే మిగితా పార్ట్ కూడా కంప్లీట్ చేసి నెక్స్ట్ సినిమాలకు వెళతాడట పవన్.. మరోవైపు క్రిష్ సినిమా విరూపాక్ష సినిమా షూటింగ్ లోనూ పవన్ పాల్గొని ఒకప్పటి పవన్ కళ్యాణ్ ని గుర్తు చేస్తున్నాడు..  అనేక సినిమాలు చేస్తున్నప్పటికీ వాటన్నిటిలో కూడా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ మాత్రం దర్శకుడు క్రిష్ జాగర్ల మూడి తో ప్లాన్ చేసిన భారీ బడ్జెట్ మరియు పాన్ ఇండియన్ చిత్రం అనే చెప్పాలి..

ఈ భారీ చిత్రానికి సంబంధించి ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ ఇంతకు ముందు ఎన్నడూ చెయ్యని జానర్ పైగా క్రిష్ తో సినిమా కావడంతో ఆ అంచనాలు మరింత స్థాయిలో ఉన్నాయి. అయితే ఈ సినిమాలో కొన్ని ఆసక్తికర సీక్వెన్స్ లను శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇప్పటికి కేవలం ఒక ప్రీ లుక్ పోస్టర్ మాత్రమే వచ్చింది. కానీ ఎప్పుడప్పుడా అని ఎదురు చూస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ కు ఇప్పుడు ముహూర్తం ఖరారు అయ్యింది. ఇది వరకే వినిపించిన డేట్ ఈ మార్చ్ 11న ఈ చిత్రం తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టైటిల్ ను విడుదల చెయ్యడం కన్ఫర్మ్ అయ్యింది.

ఇంకొన్ని రోజుల్లో టైం బయటకు వస్తుంది కానీ డేట్ అయితే అప్పటికి లాక్ అయ్యిపోయింది. ఎప్పటి నుంచో పవన్ అభిమానులు ఈ పవర్ ఫుల్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా ఫస్ట్ లుక్ లో పవన్ ఎలా ఉంటారో చూడాలి. మరి ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ స్టార్ నటి జాక్విలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే కీరవాణి సంగీతం అందిస్తుండగా ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: