నేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా నాలుగు సినిమాలను ఒప్పుకున్న సంగతి తెలిసిందే..ఇప్పటికే రాధే శ్యామ్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలను ఒప్పుకున్న ప్రభాస్  ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని సలార్ సినిమా ను కూడా అనౌన్స్ చేశాడు. వీటిలో రాధే శ్యామ్ తప్పా మిగితా సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే..ఒక్కోటి ఒక్కో స్పెషల్ ఉన్న సినిమా..  ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ సినిమా ని నాగ్ అశ్విన్, ఆదిపురుష్ సినిమాల కన్నా ముందు చేస్తున్నాడు ప్రభాస్.

ఈ నేపథ్యంలో ఈ కథనే ఎందుకు చేయాలనుకుంటున్నాడో అని సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు..   ఈ సినిమా కి సంబందించిన అన్ని ఏర్పాట్లు చక చక జరిగిపోతున్నాయి. ప్రభాస్, ప్రశాంత్ వేరే సినిమా షూటింగ్ లో ఉన్నా కూడా అవి పూర్తి చేసి ఈ సినిమా మొదలుపెట్టాలని ఆసక్తి గా ఉన్నారు.ఇక ఈ మధ్య కాలంలో మన తెలుగు నుంచి ఎన్ని సినిమాల తాలూకా విడుదల తేదీలు బయటకు వచ్చాయో తెలిసిందే. మొదటగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” నుంచి మొదలైన ఈ విడుదల తేదీల పర్వం ఇతర ఇండస్ట్రీ సినిమాల రిలీజ్ డేట్స్ పై కూడా పడింది. దీనితో అవి కూడా అనౌన్స్ అవుతూ వచ్చాయి..

మరి అలా లేటెస్ట్ గా మరో భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ “రాధే శ్యామ్” జూలై 30న కన్ఫర్మ్ చేసుకుంది. మన దగ్గర అయితే మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న “గని” అదే రోజున రేస్ లో ఉండగా లేటెస్ట్ గా మాత్రం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ చిత్రం “గంగూభాయ్ కథియావాది” కూడా అదే డేట్ ను లాక్ చేస్తూ వచ్చింది. దీనితో మన దగ్గర ఏమో కానీ హిందీలో మాత్రం గట్టి పోటీ తప్పేలా లేదని కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఎందుకంటే ఈ సినిమాను సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించడంతో ఆ ప్రభావం అక్కడ గట్టిగానే ఉంటుంది. మరి అలాగే ప్రభాస్ సినిమాపై కూడా అక్కడ మంచి అంచనాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు గట్టి క్లాషే కన్ఫర్మ్ అయ్యింది. మరి ఫైనల్ గా మాత్రం ఏం జరుగుతుందా అని ఆసక్తి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: