దీంతో ఈ కన్నడ భామకు బాలివుడ్ లో ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే మిషన్ మజ్నుతో పాటు అమితాబ్ బచ్చన్ తో ఓ సినిమాలో నటిస్తోంది. మరోవైపు మరో ప్రాజెక్టుకు సైన్ చేసినట్టు సమాచారం. వరుసగా బాలివుడ్ అవకాశాలు రావడంతో ముంబైలోనూ ఓ ఇల్లు తీసుకోవాలని డిసైడ్ అయ్యింది. బాంద్రాలో పూజా హెగ్డే కొత్తగా తీసుకున్న ఫ్లాట్ కు దగ్గరలో సెలబ్రిటీలు ఉండే ప్రాంతంలోనే ఓ ఫ్లాట్ ను కొనుగోలు చేసిందట. త్వరలోనే గృహ ప్రవేశం కూడా చేయబోతున్నట్లు సమాచారం. అలాగే హైదరాబాద్ లో కూడా రష్మిక ఇల్లు కొనుగోలు చేయబోతుందని తెలుస్తోంది.
రష్మిక నాగశౌర్య హీరోగా ఛలో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత విజయదేవరకొండ హీరోగా వచ్చిన గీతగోవిందం సినిమాతో సూపర్ హిట్ కొట్టింది. నాగార్జున, నాని హీరోలుగా వచ్చిన దేవదాసు సినిమాలోనూ ఓ హీరోయిన్ గా నటించి మెప్పించింది. వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటుంది. గత ఏడాది మహేశ్ బాబుకు జోడీగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ కు జంటగా పుష్ప సినిమాతో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ దూసుకెళ్తోంది.