సింగర్ సునీత, రామ్ వీరపనేని పెళ్లి ఓ సంచలనంగా మారింది. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే వార్త బయటకి వచ్చినప్పటి నుంచి పెళ్లి వరకూ... ఆ తర్వాత కూడా పాజిటివ్, నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి.  లేటుగానైనా మంచి డిసిషన్ తీసుకున్నారని కొందరు అంటే..ఇ ప్పుడు పెళ్లెందుకు అని అన్నవాళ్లూ ఉన్నారు. కానీ కొన్ని కొన్ని నిర్ణయాలు కొన్ని సార్లు తప్పేమో అనిపిస్తే.. కొన్ని సార్లు అవి చేయడం వల్ల మేలే జరిగిందని సంతోషించే సందర్భాలూ ఉంటాయి. సునీత, రామ్ విషయంలోనూ సరిగ్గా అలాగే జరిగింది.

సునీత, రామ్ వీరపనేని పెళ్లి గత నెల జనవరి 9న ఘనంగా జరిగింది. రామ్ ప్రముఖ మీడియా వ్యాపారవేత్త.. మ్యాంగో రామ్ గా పేరుంది. ఈయన డిజిటల్ మీడియాలో నెంబర్ వన్ గా రాణిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా డిజిటల్ మీడియాలో కొనసాగిస్తూ పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.

గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య పరిచయం ఉంది. అది కాస్తా ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ఈ జంట పెద్దలు, పిల్లల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఇప్పటికే రామ్.. సునీత పిల్లలకు తన ఆస్తిలో కొంత భాగం ఇస్తానని చెప్పారట. తన వ్యాపారంలోనూ భాగస్వాములను చేస్తానని మాటిచ్చారు.

ఇప్పుడు సునీత, రామ్ దంపతులు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా డిజిటల్ మీడియా వేదికగా కొత్త టాలెంట్ ను వెలికితీసే పనిలో పడ్డారు. పాడుతా తీయగా షో తరహాలో ఓ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. డిజిటల్ మీడియా వేదికగా కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నారట. అంతేకాదు వీరికి సినిమాల్లూ అవకాశాలు కల్పించాలని నిర్ణయానికి వచ్చారట. అందరూ రామ్ లాంటి భర్తని పొందడం నిజంగా సునీత అదృష్టమని అనుకుంటున్నారు. సునీత, ఆమెతో పాలు పిల్లలనూ సంతోషంగా చూసుకుంటే అంతకన్నా కావాల్సింది ఏముందని అందరూ అనుకుంటున్నారు. ఈ జంట కలకాలం ఇలానే సంతోషంగా ఉండాలని దీవిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: