టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన అతి తక్కువ టైమ్ లో మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్. 2016 లో కిరాక్ పార్టీ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఈ సినిమా తరువాత అంజనీపుత్ర,చమక్,చలో ఇలాంటి మూవీలలో తనదైన శైలిలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం రష్మిక వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రష్మిక ఇక సౌత్ సినిమాలను పట్టించుకోదా అన్న విషయం  గురించి తెలుసుకుందాం.


 టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన ఇకపై సౌత్ సినిమాలను పట్టించుకోదా అంటే అవుననే గుసగుసలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందుకు కారణంగా రష్మిక కు వరుసగా బాలీవుడ్ లో ముఖ్యంగా ఫ్యాన్ ఇండియా సినిమాల్లో అవకాశాలు రావడమే కారణం అని అంటున్నారు. అందుకు తగినట్లు ఇప్పుడు రష్మిక చేసిన ఓ పని కూడా సినీ వర్గాల్లో ఈ వాదనకు బలాన్ని ఇస్తున్నాయి. ఇంతకీ రష్మిక అంతలా అనుమానం వచ్చేలా ఏ పని చేసిందంటే వివరాల్లోకి వెళితే.


 రష్మిక ముంబైలో ఒక అరుదైన ఫ్లాట్ కొనుగోలు చేసిందట. బాలీవుడ్ వర్గాలకు అందుబాటులో ఉండటానికి రష్మిక  ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి  ఇకపై సౌత్ సినిమాలను పట్టించుకోదా అనే వాదన బలంగా వినిపిస్తోంది. కిరాక్ పార్టీ తో కెరీర్ స్టార్ట్ చేసిన రష్మిక మందన తెలుగులో మహేష్ తో సరికే సరిలేరు నీకెవ్వరు సినిమాలో జోడీ కట్టింది. ఆ సినిమా సక్సెస్ తర్వాత రష్మిక కు బాగా పోకస్ తెచ్చిపెట్టిన చిత్రం పుష్ప. అల్లు అర్జున్ సుకుమార్ కాంబో లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫ్యాన్ ఇండియా చిత్రం కావడంతో సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న రష్మిక మందన కు ఆటోమేటిక్ గా మంచి  గుర్తింపు దక్కింది.


 దీంతో రష్మిక వరుసగా బాలీవుడ్ సినిమాలతో పాటు ఫ్యాన్ ఇండియా మూవీ అవకాశం దక్కింది. రీసెంట్ గా మిషన్ మజ్ను అనే బాలీవుడ్ చిత్రంతో రష్మిక మందన బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ సినిమా సెట్స్ పై ఉండగానే అమితాబ్ బచ్చన్ తో కలిసి మరో చిత్రంలో నటించడానికి అవకాశం వచ్చింది. ఈ రెండు సినిమాలతో పాటు పుష్ప సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేస్తూ రష్మిక బిజీబిజీగా ఉండగానే, రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలోనూ రష్మిక మందన హీరోయిన్ గా ఓకే అయిందని అంటున్నారు. ఇలా వరుస కేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రష్మిక ఇకపై ఓ మోస్తారు సినిమాలను పట్టించుకోదని అంటున్నారు సినీ వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: