ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..‘బాహుబలి’ సినిమాతో రెబల్ స్టార్ ప్రభాస్  రేంజ్ అమాంతం పెరిగిపోయింది.దేశం మొత్తం మీద ప్రభాస్ కి విపరీతమైన క్రేజ్ పెరిగింది. మార్కెట్లో అతడి సినిమాలకు ఇప్పుడు భారీ డిమాండ్ పెరిగింది.ఇక ప్రభాస్  సినిమాలకు పోటీగా బాలీవుడ్ తారలు కూడా సినిమాలకు విడుదల చేయడానికి భయపడే పరిస్థితి కలిగింది. ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా ఎలాంటి పోటీ లేకుండా విడుదలైంది. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. దీంతో బాలీవుడ్ తారలు ప్రభాస్ ని లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది.ఇక ప్రస్తుతం రెబల్ స్టార్  ప్రభాస్ నటిస్తోన్న ‘రాధేశ్యామ్’ సినిమా జూలై 30న విడుదల కానుందని తెలిసి కూడా.. అదే రోజు ఓ బాలీవుడ్ సినిమాను బరిలోకి దింపుతున్నారు.


ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.. అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన ‘గంగూభాయ్’. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన చేసిన ఈ సినిమాను జూలై 30న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. నిజానికి ‘రాధేశ్యామ్’ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. పైగా ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్ప్స్ నిరాశ పరిచింది. దీనిపై బాలీవుడ్ లో చాలా విమర్శలు వినిపించాయి. నార్త్ లో ప్రభాస్ క్రేజ్ పోతుందంటూ కథనాలు ప్రచురించడం జరిగింది..


ఇక ‘రాధేశ్యామ్’కి అంత క్రేజ్ ఇంకా హైప్ లేనందువల్ల ఆ సినిమా విషయంలో భయపడాల్సిన పని లేదని భావించిన ‘గంగూభాయ్’ టీమ్.. ఇప్పుడు ప్రభాస్ సినిమాకి పోటీగా తమ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. బాలీవుడ్ లో ‘గంగూభాయ్’ సినిమాపై అంచనాలు ఏర్పడడంతో బాక్సాఫీస్ వద్ద స్కోప్ ఉంటుందని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ భావిస్తున్నాడు. మరి ఈ రెండింటిలో ఏ సినిమా భారీ విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి లేక భారీ ప్లాప్ ని మూటగట్టుకుంటుందో చూడాలి.. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: