తొలిసారిగా బాలీవుడ్ లో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ హీరోగా తెరకెక్కిన ఎమ్ ఎస్ ధోని మూవీ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది యువ భామ కియారా అద్వానీ. ఆ మూవీలో ఒక హీరోయిన్ గా దిశా పటాని నటించగా మరొక హీరోయిన్ గా నటించిన కియారా తన ఆకట్టుకునే అందం, అభినయంతో ఆడియన్స్ మనసులు గెలుచుకుంది. దాని అనంతరం తెలుగులో ఆమెకు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ హీరోగా తెరకెక్కిన భరత్ అనే నేను మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ రావడం, రిలీజ్ తరువాత ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో తెలుగులో కూడా కియారా కి సూపర్ ఫాలోయింగ్ దక్కింది అనే చెప్పాలి.
తనకు ఎంతో ఇష్టమైన సూపర్ స్టార్ తో సినిమా అవకాశం రావడం, అలానే ఆ మూవీ కూడా పెద్ద సక్సెస్ కావడం నిజంగా తాను ఎప్పుడూ మరిచిపోలేని విషయం అని కియారా తరచూ పలు ఇంటర్వ్యూల్లో మహేష్ గురించి చెప్తూ ఉంటుంది. ఇక దాని తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయ రామ మూవీ లో హీరోయిన్ గా ఛాన్స్ అందుకున్న కియారా, ఊహించని విధంగా దానితో పెద్ద డిజాస్టర్ ని చవిచూసింది. మంచి యాక్షన్ తో కూడిన ఎమోషనల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫెయిల్యూర్ తరువాత ఆమె పూర్తిగా బాలీవుడ్ సినిమాలకె పరిమితం అయింది. 
ఇక ఇటీవల అక్షయ్ కుమార్ హీరోగా ఆమె నటించిన లక్ష్మి మూవీ ఓటిటి లో రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించింది. ఇక తరచు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్ తో తన సినిమా, వ్యక్తిగత విషయాలు పంచుకునే అలవాటు గల కియారా, ఇటీవల తాను బ్లాక్ కలర్ డ్రెస్ లో దిగిన ఫోటోలు పోస్ట్ చేసింది. ఆ డ్రెస్ లో ఎంతో అందంగా మెరిసిపోతున్న కియారా ని చూడడానికి నిజంగా రెండు కళ్ళు చాలడం లేదని పలువురు ఆమె అభిమానులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: